Home > సినిమా > Janhvi Kapoor : బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor : బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor  : బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
X

అందాల నటి జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకులు మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట ప్రియుడు శిఖర్ పహారియా ఉన్నారు. వీరితోపాటు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మహేశ్వరి సైతం వెంకన్నను దర్శించుకున్నారు. దివంగత నటి శ్రీదేవికి మహేశ్వరి చెల్లెలు అవుతుంది.





అంటే జాన్వీ చిన్నమ్మ వరస అవుతుంది జాన్వీ. ఇదిలా ఉంటే… మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ కొన్నేళ్లుగా ప్రేమలో ఉందనే ప్రచారం నడుస్తుంది. వీరిద్దరు కలిసి రెస్టారెంట్స్.. పార్టీస్.. మూవీ ఈవెంట్లలో కనిపిస్తున్నారు. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్లలోనూ జాన్వీ, శిఖర్ కలిసి హాజరయ్యారు. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా బాలీవుడ్ క్రేజీ స్టార్ గా మారింది. గ్లామర్ షోలో జాన్వీ కపూర్ ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో జాన్వీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ షురూ అయింది. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలకగా.. అర్చకులు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు.







Updated : 6 March 2024 11:53 AM GMT
Tags:    
Next Story
Share it
Top