Home > సినిమా > మల్టిఫుల్ షేడ్స్‌లో నటించా..హీరోయిన్ ఆయుషి పటేల్

మల్టిఫుల్ షేడ్స్‌లో నటించా..హీరోయిన్ ఆయుషి పటేల్

మల్టిఫుల్ షేడ్స్‌లో నటించా..హీరోయిన్ ఆయుషి పటేల్
X

టాలీవుడ్‌లోకి కొత్త కాన్సెప్ట్‌తో అనేక సినిమాలు వస్తున్నాయి. అలాంటి కేటగిరీకి చెందినదే 'కలియుగం పట్టణంలో' మూవీ. ఈ మూవీలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించారు. కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించిన ఈ మూవీ మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది.

తాజాగా ఈ మూవీ హీరోయిన్ ఆయుషి పటేల్ ఈ సినిమా విశేషాలను తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ.. ఈ మూవీలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందన్నారు. మల్టిపుల్ షేడ్స్ ఉంటాయన్నారు. ఇంటర్వెల్‌లో ఒకలా, క్లైమాక్స్‌లో మరోలా ఒపీనియన్ వస్తుందన్నారు. చిన్నతనం నుంచీ తనకు సినిమాలంటే చాలా ఇష్టమని, పవన్ కళ్యాణ్ గారి అభిమానినని, ఓ మేనేజర్ వల్ల ఈ మూవీలో అవకాశం వచ్చిందన్నారు.

కడపలో అందమైన లొకేషన్స్ మధ్య షూటింగ్ జరిగిందని, అక్కడి ప్రజలు ఎంతో సపోర్ట్ చేశారన్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం టూర్స్ వేస్తున్నామని, వెళ్లిన ప్రతి చోటా మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. దర్శకుడు రమాకాంత్ రెడ్డి తనకు రెండు గంటలకు పైగా కథను నెరేట్ చేశారన్నారు. కట్ చెబితే ఎండ్‌లో వచ్చే ఎక్స్‌ప్రెషన్స్ మిస్ అవుతాయ్ అని కట్ చెప్పకుండా డైరెక్టర్ ఎంతో సరదాగా షూటింగ్ చేసేవారన్నారు. ఆర్ఆర్ వల్ల సినిమా మరోస్థాయికి వెళ్లిందన్నారు. నిర్మాతలు బాగా చూసుకున్నారన్నారు.

విశ్వ కార్తికేయ పక్కన నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనకు ఎంతో సహకరించారన్నారు. 'కలియుగం పట్టణంలో' రిలీజ్ కాకముందే తనకు మూడు ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చాయన్నారు. లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ వంటివి తనకు నచ్చదని, అందుకే కొన్ని సినిమాలు ఒప్పుకోలేదన్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నానని అన్నారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి రాలేదని, కొన్ని సినిమాలు చేసినా పర్లేదు.. మంచి మూవీసే చేస్తానని ఆయుషి పటేల్ తెలిపారు.

Updated : 28 March 2024 1:20 PM GMT
Tags:    
Next Story
Share it
Top