Home > సినిమా > ప్రైమ్లో వెబ్ సిరీస్ చూస్తూ మహేశ్ బాబు ఎమోషనల్.. ఇంటకీ ఏ సిరీస్ అంటే?

ప్రైమ్లో వెబ్ సిరీస్ చూస్తూ మహేశ్ బాబు ఎమోషనల్.. ఇంటకీ ఏ సిరీస్ అంటే?

ప్రైమ్లో వెబ్ సిరీస్ చూస్తూ మహేశ్ బాబు ఎమోషనల్.. ఇంటకీ ఏ సిరీస్ అంటే?
X

బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఆమె నిర్మాతగా తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ పోచర్.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ను చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. పోచర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అలాగే ఎమోషనల్ అవుతూ ఓ పోస్ట్ పెట్టాడు. ‘ఎవరైనా ఏనుగులను అలా ఎలా చంపగలరు? వాళ్లకు మానవత్వం అనేది లేదా? అలా చేస్తున్నప్పుడు వాళ్ల చేతులు వణకలేదా? ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు ఇవే ప్రశ్నలు నా మైండ్ లో తిరిగాయి. వీటిని కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరు పోరాడాల’ని రాసుకొచ్చాడు.

కాగా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. మలయాళ నటులు నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దివ్యేంద్ర భట్టాచార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్-థ్రిల్లర్ కు.. రిచీ మెహతా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈయనకు ఎమ్మీ అవార్డు కూడా వచ్చింది. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఏనుగు దంతాల స్మగ్లింగ్ తో పాటు.. అడవుల్లోని వన్య ప్రాణులపై దాడులు చేస్తుంటారు. వారిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు, ఎన్జీవో కార్మికులు, లోకల్ పోలీసులు ఏం చేస్తారనేది కథ.



Updated : 28 Feb 2024 3:24 PM GMT
Tags:    
Next Story
Share it
Top