Home > సినిమా > మహేశ్ ఇంట్లో స్పెషల్ గెస్ట్..వెల్‎కమ్ చెప్తున్న నమ్రత

మహేశ్ ఇంట్లో స్పెషల్ గెస్ట్..వెల్‎కమ్ చెప్తున్న నమ్రత

మహేశ్ ఇంట్లో స్పెషల్ గెస్ట్..వెల్‎కమ్ చెప్తున్న నమ్రత
X

టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు ఇంట్లోకి స్పెషల్ గస్ట్ వచ్చేసింది. ఈ గెస్ట్ మాత్రం మహేశ్‌ ఫ్యామిలీలో ఆనందాన్ని నింపుతోంది. మహేశ్ గారాలపట్టి సితారతో ఆడుకునేందుకు రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. ఇంతకీ ఎవరా గెస్ట్ అనుకుంటున్నారా? అదే స్నూపీ. మహేశ్‌ బెస్ట్ హాఫ్ నమ్రత కొత్తగా తన ఇంట్లోకి ఓ కుక్కపిల్లను తీసుకొచ్చింది. దానికి ముద్దుగా స్నూపీ అని పేరు పెట్టుకుంది. ఈ మధ్యనే వీరి ఇంట్లోని సితార ఆడుకునే కుక్కపిల్ల ప్లూటో చనిపోయింది. ఆ బాధ నుంచి సితార పాప బయటపడేందుకు నమ్రతా మరో కొత్త కుక్కపిల్లను తీసుకువచ్చారు.

ఈ విషయాన్ని నమ్రత సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. తన ఇన్‎స్టాగ్రామ్‏లో స్నూపీ.. నిన్ను ప్లూటోనే మా దగ్గరకు పంపింది అంటూ కుక్కపిల్ల ఫోటోను షేర్ చేస్తూ క్యాప్షన్ రాసింది. "ఓవైపు ఒక ప్లూటోను కోల్పోయామన్న బాధ..మరోవైపు మరో కుక్కపిల్లను ప్రేమించబోతున్నామన్న సంతోషం..నిన్ను మా ఫ్యామిలీలోకి వెల్‎కమ్ చెబుతున్నాం స్నూపీ"..వీ లవ్ యూ సో‎మచ్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది నమ్రత . ఈ పిక్ చూసిన మహేశ్ అభిమానులు ఆ పప్పీ ఎంత అమాయకంగా చూస్తోందో అని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే మహేశ్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‎తో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్రివిక్రమ్- మహేశ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. వచ్చే సంవత్సరం సంక్రాంతి నాటికి గుంటూరు కారం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకీ తమన్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.


Updated : 9 Sep 2023 11:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top