Home > సినిమా > పర్వతాల మధ్య మెగా కపుల్.. వరుణ్, లావణ్య ఫోటోలు వైరల్

పర్వతాల మధ్య మెగా కపుల్.. వరుణ్, లావణ్య ఫోటోలు వైరల్

పర్వతాల మధ్య మెగా కపుల్.. వరుణ్, లావణ్య ఫోటోలు వైరల్
X

టాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన వైఫ్ లావణ్య త్రిపాఠితో కలిసి మ్యారేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. మ్యారేజ్ తర్వాత ఫారిన్ వెకేషన్‌కి వెళ్లిన ఈ జంట ఆ తర్వాత కాశ్మీర్‌కు కూడా వెళ్లి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చింది. ప్రస్తుతం ఈ జంట హిమాచల్ ప్రదేశ్‌లో దర్శనమిచ్చింది. ప్రకృతి అందాలను ఈ జంట తెగ ఆస్వాదిస్తోంది. హోలీ పండగను కూడా వరుణ్ తన అత్తారింట్లో జరుపుకున్నట్లు తెలుస్తోంది. వీలుదొరికినప్పుడల్లా ఈ మెగా కపుల్ వెకేషన్‌కు వెళ్తూ ఉంటోంది. తాజాగా వారు వెళ్లిన వెకేషన్ ఫోటోలను వరుణ్, లావణ్య జంట తమ సోషల్ మీడియాలో అకౌంట్లలో షేర్ చేశారు. ఆ ఫోటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే వరుణ్ తేజ్ చివరిగా 'ఆపరేషన్ వాలెంటైన్' అనే మూవీ చేశాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా వచ్చిన ఈ మూవీ కమర్షియల్‌గా అంతగా వర్కౌట్ కాలేదు. అంతకుముందు తీసిన 'గాండీవధారి అర్జున' మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో సరైన సక్సెస్ కోసం వరుణ్ ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం 'మట్కా' మూవీ చేస్తున్నాడు.

మట్కా గేమ్ ఆడి కింగ్‌లా ఎదిగిన రతన్ ఖత్రి అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. 1960 బ్యాక్ డ్రాప్‌తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. మొత్తానికి ఈ మూవీతోనైనా వరుణ్ సక్సెస్ సాధించాలని ఆశిద్దాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుణ్, లావణ్యలో ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Updated : 26 March 2024 10:34 AM GMT
Tags:    
Next Story
Share it
Top