నా భర్త నన్ను మోసం చేశాడు..నటి మహాలక్ష్మీ సంచలన కామెంట్స్
X
ఈ మధ్యనే కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ చీటింగ్ కేసులో జైలుకు వెళ్లాడు. ఒక బిజినెస్ మెన్ను చీట్ చేసినందుకు గాను ఆయన అరెస్ట్ అయ్యాడు. ఈ న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్గా మారింది. గతేడాది బుల్లితెర నటి మహాలక్ష్మి శంకర్, రవీందర్ను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే భర్త జైలుకు వెళ్లినప్పటికీ ఈమె ఎప్పటిలాగే తన ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్స్ ఆమెపై ఫైర్ అయ్యారు. భర్త జైల్లో ఉంటే నీకిది అవసరమా అంటూ ఆమెను తిట్టిపోశారు.
అయితే తాజాగా వీరిద్దరి వ్యవహారం కోలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యింది. భర్త గురించి మహాలక్ష్మి సంచలన కామెంట్స్ చేసింది. తన భర్త రవీందర్ తనను చీట్ చేసి పెళ్లి చేసుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేసింది. పెళ్లికి ముందు ఈ విషయాలను తనకు చెప్పలేదని ఆమె తన రిలేటివ్స్ దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. నేను మళ్లీ మోసపోయాను. పెళ్లికి ముందు నాకు రవీందర్ ఈ విషయాల గురించి చెప్పలేదు అంటూ ఆమె ఫీల్ అయినట్లు సన్నిహితుల చెబుతున్నారు. భర్త జైలుకు వెళ్లడంతో మహాలక్ష్మి స్ట్రెస్ గా ఫీల్ అవుతోందని కొందరు చెబుతున్నారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.