Home > సినిమా > Nayanthara : ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నయనతార.. ఏం జరిగిందంటే..?

Nayanthara : ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నయనతార.. ఏం జరిగిందంటే..?

Nayanthara : ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నయనతార.. ఏం జరిగిందంటే..?
X

నయనతార - విఘ్నేష్ శివన్.. ఏడేళ్ల ప్రేమ తర్వాత 2022లో పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లైన కొన్నాళ్లకే ఈ జంట సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. నయన్ ఇటీవలే ఇన్స్టాగ్రామ్లోకి అడుగుపెట్టింది. తన పిల్లల ఫొటోతో ఆమె ఇన్స్టాలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతం ఆమెకు 78లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇటీవల ఇన్స్టాలో ఆమె తన భర్తను అన్ ఫాలో అవడం చర్చనీయాంశంగా మారింది.





నయన్ - విఘ్నేష్ మధ్య విభేధాలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. అయితే తాజాగా వీటికి నయన్ చెక్ పెట్టింది. ఇన్స్టాలో మళ్లీ తన భర్తను నయన్ ఫాలో అవుతోంది. అటు విఘ్నేష్ సైతం నయన్ ఫొటోను స్టోరీ పెట్టడంతో ఈ రూమర్లకు చెక్ పడింది. ఏదో టెక్నికల్ పొరపాటు వల్ల అన్ ఫాలో అయ్యిందేమో అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. కాగా నయన్ ప్రస్తుతం టెస్ట్ అనే మూవీలో నటిస్తోంది. ఇందులో మాధవన్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Updated : 3 March 2024 7:38 AM GMT
Tags:    
Next Story
Share it
Top