Home > సినిమా > అత్తారింటికి వెళ్లగానే ఆ పని చేసిన రకుల్.. కామెంట్స్ వైరల్

అత్తారింటికి వెళ్లగానే ఆ పని చేసిన రకుల్.. కామెంట్స్ వైరల్

అత్తారింటికి వెళ్లగానే ఆ పని చేసిన రకుల్.. కామెంట్స్ వైరల్
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్యనే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని ఆమె వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 22వ తేదిన గోవాలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో వారికి పెళ్లి జరిగింది. సినీ ప్రముఖులు, కుటుంబీకులు, సన్నిహితుల మధ్య వారి వివాహ వేడుక జరిగింది. వివాహం అనంతరం రకుల్ తన అత్తారింట్లో అడుగుపెట్టారు. సంప్రదాయం ప్రకారంగా మెట్టినింట్లో తొలిసారి రకుల్ ఓ పని చేశారు.

తన అత్తారింట్లో తొలిసారి రకుల్ హల్వా తయారు చేశారు. ప్రస్తుతం రకుల్ హల్వా చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలకు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సంప్రదాయం ప్రకారంగా మెట్టినింట అడుగుపెట్టిన కొత్త కోడలు పెళ్లైన రెండో రోజు ఏదైనా స్వీట్ చేయాల్సి ఉంటుంది. హల్వా, ఖీర్ వంటివి చేస్తుంటారు. దానినే చౌకా చర్దానా అని అంటారు. ఆ సంప్రదాయంలో భాగంగానే రకుల్ స్వయంగా సూజీ కా హల్వాను తయారు చేసి అత్తింటివారికి రుచి చూపారు.

ఇకపోతే రకుల్, జాకీ భగ్నానీల వివాహం పంజాబీ ఆనంద్ కరాజ్, సింధీ సంప్రదాయాల ప్రకారంగా జరిగింది. ఆ పెళ్లి వేడుకకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. రకుల్ ప్రీత్ సింగ్ చివరిసారిగా తెలుగులో కొండ పొలం అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్2 సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ లోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు.

Updated : 25 Feb 2024 1:55 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top