Home > సినిమా > Director Krish : రాడిసన్ డ్రగ్స్ కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

Director Krish : రాడిసన్ డ్రగ్స్ కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

Director Krish  : రాడిసన్ డ్రగ్స్ కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
X

గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్ పెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్టులో మరోసారి క్రిష్ పేరును పోలీసులు ప్రస్తావించారు.వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్కు మీర్జా వాహిద్ ఫిబ్రవరిలోనే 10సార్లు డ్రగ్స్ అందజేసినట్లు పోలీసులు తేల్చారు. ఫిలింనగర్, గచ్చిబౌలి, జూబ్లిహిల్స్ ప్రాంతాల్లో కొకైన్ చేతులు మారినట్లుగా గుర్తించిన పోలీసులు 2గ్రాముల కొకైన్కు రూ.30వేల చెల్లించినట్లు చెప్పారు.

హోటల్లోని 1200, 1204 రూమ్స్లో డ్రగ్ పార్టీలు జరిగినట్లు పోలీసులు తేల్చారు. అటు హోటల్ ఆపరేషన్స్ మేనేజర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వలేదనే కోణంలో ఆయన్ని విచారించనున్నారు. స్నాప్ చాట్ ద్వారా డ్రగ్స్ సరఫరా జరిగినట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో నిన్న పోలీసుల విచారణకు క్రిష్ హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు విచారించిన పోలీసులు ఆయన శాంపిల్స్ తీసుకొని పంపించారు. అయితే యూరిన్ టెస్టులో నెగిటివ్ రాగా.. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ రావాల్సి ఉంది. బ్లడ్ టెస్టులో నెగిటివ్ వచ్చినా క్రిష్ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది.

డ్రగ్స్‌‌ కేసులో తనను అరెస్ట్ చేయకుండా..ముందస్తు బెయిల్‌‌‌‌ మంజూరు చేయాలని ఇప్పటికే క్రిష్‌ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ వేశారు. ఆయన పిటిషన్పై కోర్టు మార్చి 4న విచారణ చేపట్టనుంది. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు వివేకానంద వాంగ్మూలం మేరకు.. పోలీసులు క్రిష్‌‌‌‌ పేరును ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లో చేర్చారు. ఈ డ్రగ్స్ కేసులో మొత్తం 12 మంది పేర్లను FIRలో చేర్చారు. ఇప్పటికే డ్రగ్ సప్లైయర్ అబ్బాస్, డ్రగ్ పెడ్లర్ వాహీద్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణకు హాజరుకాని వారికి నోటీసులు జారీ చేశారు.


Updated : 2 March 2024 8:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top