Home > సినిమా > బాలీవుడ్లో విషాదం.. పూనమ్ పాండే మృతి

బాలీవుడ్లో విషాదం.. పూనమ్ పాండే మృతి

బాలీవుడ్లో విషాదం.. పూనమ్ పాండే మృతి
X

వివాదస్పద నటి పూనమ్ పాండే మరణించారు. క్యాన్సర్తో మరణించినట్లు ఆమె టీమ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ‘‘ఇవాళ ఉదయం పూనమ్ పాండే మరణించింది. గర్భాశయ క్యాన్సర్తో ఆమె చనిపోయింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధిస్తున్నాము.’’ అని ఆమె టీం పోస్ట్ చేసింది. అయితే ఆమె అభిమానులు మాత్రం ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. ఇది నిజమా, ప్రాంక్ కావొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పలు రొమాంటిక్ సినిమాల్లో పూనమ్ నటించింది. తన సోషల్ మీడియాలోనూ వివాదస్పద పోస్టులతో నిత్యం వార్తల్లో నిలిచేది. ఇక కంగనా హోస్ట్ చేసిన లాకప్ షోలోనూ ఈ అమ్మడు పార్టిసిపెట్ చేసింది. ఎలిమినేషన్ నుంచి తనను కాపాడితే టాప్ లెస్గా కనిపిస్తానని చెప్పింది.

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన పూనమ్‌ 2013లో ‘నషా’ మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించింది. సినిమాల కన్నా వివాదాస్పద కామెంట్లతోనే ఆమె ఎక్కువగా పబ్లిసిటీ పొందింది. 2011 వన్డే ప్రపంచకప్‌ టోర్నీ సందర్భంగా భారత్ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంకి వస్తానని ప్రకటించిన సంచలనం సృష్టించింది.

Updated : 2 Feb 2024 6:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top