Home > సినిమా > యోగా టీచర్​తో ప్రొడ్యూసర్ సెకండ్ మ్యారేజ్

యోగా టీచర్​తో ప్రొడ్యూసర్ సెకండ్ మ్యారేజ్

యోగా టీచర్​తో ప్రొడ్యూసర్ సెకండ్ మ్యారేజ్

యోగా టీచర్​తో ప్రొడ్యూసర్ సెకండ్ మ్యారేజ్
X



ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు ఆర్జీవీ మేనత్త కొడుకు మధు మంతెన రెండో పెళ్లి చేసుకున్నారు. జూన్​ 11న రచయిత, యోగా టీచర్​ ఐరా త్రివేది మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముంబయిలో గ్రాండ్​గా జరిగాయి. ఈ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్​ అమీర్ ఖాన్, రాజ్‌కుమార్ రావు, హృతిక్​ రోషన్​, నిఖిల్ ద్వివేది తదితురులు హాజరై సందడి చేసారు.





కాగా.. 2015లో ఫ్యాషన్ డిజైనర్, బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురు మసాబా గుప్తాను.. పెళ్లి చేసుకున్న మధు.. కొన్నేళ్ల తర్వాత మనస్పర్థలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఐరాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆ ప్రేమ.. ఇప్పుడు వివాహాబంధంతో ఒక్కటైంది.ముంబయిలో జరిగిన ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి

కాగా.. శనివారం జరిగిన మెహందీ వేడుకలో.. పలువురు బాలీవుడ్ స్టార్స్, ప్రముఖులు హాజరయ్యారు. అల్లు అర్జున్ కూడా ఈ వివాహానికి హాజరయ్యాడు. ఈ వేడుకలో అల్లు అర్జున్.. అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ తో సరదాగా కాసేపు ముచ్చరించారు. హృతిక్ రోషన్ బన్నీని ఆప్యాయంగా హత్తుకున్నాడు. దీంతో బన్నీ హృతిక్ కి హగ్ ఇచ్చే ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో పక్కనే అమీర్ ఖాన్ కూడా ఉన్నాడు. దీంతో బన్నీ అభిమానులు ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు.





ఇకపోతే నిర్మాత మధు.. గతంలో తెలుగులో 'కార్తిక్'​, 'రక్త చరిత్ర' అనే చిత్రాలను నిర్మించారు. హిందీలో 'గజిని', 'అగ్లీ', 'క్వీన్', 'సూపర్​ 30' వంటి హిట్ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం.. తెలుగు నిర్మాత అల్లు అరవింద్​తో కలిసి.. రణ్​బీర్​ కపూర్- ఆలియాభట్​-యశ్​ ప్రధాన పాత్రల్లో 'రామాయణం' నిర్మించే పనుల్లో ఉన్నారు.



Updated : 12 Jun 2023 3:28 AM GMT
Tags:    
Next Story
Share it
Top