Home > సినిమా > multiplex : మల్టీప్లెక్సుల్లో రామ మందిర ప్రారంభోత్సవం లైవ్.. టికెట్ రేట్ ఎంతంటే..?

multiplex : మల్టీప్లెక్సుల్లో రామ మందిర ప్రారంభోత్సవం లైవ్.. టికెట్ రేట్ ఎంతంటే..?

multiplex : మల్టీప్లెక్సుల్లో రామ మందిర ప్రారంభోత్సవం లైవ్.. టికెట్ రేట్ ఎంతంటే..?
X

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. జనవరి 22న బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశ విదేశాలకు చెందిన అతిధులు ఈ కార్యక్రమానికి తరలిరానున్నారు. ఈ మహాక్రతువును చూసేందుకు వెళ్లాలని లక్షలాది మంది మనసులో ఉన్నా అదిసాధ్యమయ్యే పనికాదు. ఈ క్రమంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని టీవీలో లైవ్ టెలికాస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో సిల్వర్ స్క్రీన్పై అయోధ్య రామయ్య తొలి దర్శన భాగ్యం కల్పించాలని మల్టీప్లెక్స్ ల నిర్వాహకులు నిర్ణయించారు.

పీవీఆర్‌, ఐనాక్స్‌ మల్టీప్లెక్సుల్లో రామ మందిర ప్రారంభోత్సవం, రాముని ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకోసం కేవలం రూ.100 ఛార్జ్ చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బిగ్ స్క్రీన్స్ పై ఈ మహాక్రతువులు చూడవచ్చు. దేశంలోని 70నగరాల్లో 170 కన్నా ఎక్కువ మల్టీప్లెక్సుల్లో రాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. చారిత్రక ఘట్టాన్ని పెద్ద తెరపై చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మల్టీప్లెక్స్ ల యాజమాన్యాలు ప్రకటించాయి. రామ మందిర ప్రారంభోత్సవం లైవ్ టెలికాస్ట్ టికెట్లను పీవీఆర్, ఐనాక్స్ అఫీషియల్ వెబ్ సైట్లతో పాటు బుక్ మై షోలోనూ బుక్ చేసుకోవచ్చు.




Updated : 20 Jan 2024 8:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top