Home > సినిమా > Vyuham Movie: ‘వ్యూహం’ సినిమాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్... విడుదల తేదీ ఇదే

Vyuham Movie: ‘వ్యూహం’ సినిమాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్... విడుదల తేదీ ఇదే

Vyuham Movie: ‘వ్యూహం’ సినిమాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్... విడుదల తేదీ ఇదే
X

టాలీవుడ్‌ ప్రముఖ డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. హైకోర్టు సూచనలతో వ్యూహం సినిమాకు రెండో సారి సెన్సార్ నిర్వహించారు. దీంతో సినిమాకు సెన్సార్ అడ్డంకులు తొలిగిపోయాయి. సినిమాను ఈ నెల 16న వచ్చే శుక్రవారం విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజానికి రెండు నెలల క్రితమే వ్యూహం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. కానీ సినిమా విడుదలను నిలిపివేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా చిత్రీకరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా విడుదల కూడా ఆగిపోయింది. ఈ క్రమంలో చిత్ర నిర్మాత, దర్శకుడు హైకోర్టును ఆశ్రయించారు. ప్రతిగా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మరోసారి చిత్రాన్ని పరిశీలించి ఒక కమిటీని ఏర్పాటు చేసి మరొకసారి సెన్సార్‌ ఇవ్వాలని గతంలో కోర్టు తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు మరోసారి చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు యూ సర్టిఫికేష్ జారీ చేసింది. దీంతో వ్యూహం సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. సినిమాను ఫిబ్రవరి 16న విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నామని చిత్ర నిర్మాత తెలిపారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను తీశారు. సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా.. వైఎస్ భారతి పాత్రను మానస పోషించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. వ్యూహం సినిమా తర్వాత దీనికి సీక్వెల్ గా శపథం మూవీ కూడా చేస్తానని ఇప్పటికే దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ ప్రకటించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక జరిగిన పరిస్థితులను ఆ చిత్రంలో చూపిస్తానని పేర్కొన్నారు. అయితే, వ్యూహం సినిమానే చాలా అడ్డంకులను ఎదుర్కొంది. ఇప్పుడు ఎట్టకేలకు లైన్ క్లియర్ చేసుకుంది.


Updated : 8 Feb 2024 1:35 PM GMT
Tags:    
Next Story
Share it
Top