Home > సినిమా > సీఎంను కలిసిన రామ్ చరణ్ తేజ్

సీఎంను కలిసిన రామ్ చరణ్ తేజ్

సీఎంను కలిసిన రామ్ చరణ్ తేజ్
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేను కలిశారు. సతీమణి ఉపాసనతో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన వారికి గ్రాండ్ వెల్కమ్ లభించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఉపాసన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి సహా చైతన్యవంతమైన మహారాష్ట్ర ప్రజలారా.. మీ అసాధారణమైన ఆతిథ్యం, ఆప్యాయతకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం’’ అని ఉపాసన రాసుకొచ్చింది. అటు ఏక్ నాథ్ షిండే సైతం ట్వీట్ చేశారు. ‘‘రామ్ చరణ్ దంపతులతో సమావేశం బాగా జరిగింది. సినీ రంగం సహా పలు అంశాలపై చర్చించాం’’ అని సీఎం ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరి భేటీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.

Updated : 22 Dec 2023 1:50 PM GMT
Tags:    
Next Story
Share it
Top