Home > సినిమా > అందరూ అదే చేస్తున్నారు.. నాకెందుకు సిగ్గు..తమన్నా షాకింగ్ కామెంట్స్

అందరూ అదే చేస్తున్నారు.. నాకెందుకు సిగ్గు..తమన్నా షాకింగ్ కామెంట్స్

అందరూ అదే చేస్తున్నారు.. నాకెందుకు సిగ్గు..తమన్నా షాకింగ్ కామెంట్స్
X

బాలీవుడ్‎లో ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నా హవా నడుస్తోంది. వరుసగా వెబ్ సిరీస్‎లలో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోంది. ఈమధ్యనే ఓటీటీలో విడుదలైన జీ కరదా వెబ్ సిరీస్‎లో బోల్డ్‎గా నటించి అందరి మైండ్ బ్లాక్ చేసింది తమన్నా. ఇదే ఊపులో లస్ట్ స్టోరీస్ 2తో జూన్ 29న మరోసారి తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్‎తో ఇరగదీయాలని ఫిక్స్ అయ్యింది. నిజానికి తమన్నా అనగానే తెలుగు ప్రేక్షకులకు ఆమె డ్యాన్స్ మూవ్స్ గుర్తుకు వస్తాయి. ఆమె ఎనర్జీ, గ్రేస్ ముందు ఏ హీరోయిన్ కూడా పనికిరాదు. అలాంటి ఈ చిన్నది ఇప్పుడ అందాల ప్రదర్శనతో బోల్డ్ యాక్టింగ్‎తో ఓటీటీని షేక్ చేస్తోంది. ఈ మధ్యనే విడుదలైన లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్‎లో తమన్నా హద్దు చెరిపి మరీ రెచ్చిపోయిందని, బోల్డ్ పాత్రల్లో అశ్లీల సీన్స్‎లో నటించిందన అభిమానులు పీల్ అవుతున్నారు.





ఈ బోల్డ్ సిరీస్‎పైన తాజాగా తమన్నా స్పందించింది. షాకింగ్ కామెంట్స్ చేసింది." లస్ట్‌ స్టోరీస్‌ ఫస్ట్ పార్ట్ చూశాక నా అభిప్రాయం మారిపోయింది. ప్రేక్షకులు కూడా ఇలాంటి కంటెంట్‎నే ఇష్టపడుతున్నారు. కాలంతో పాటు ప్రేక్షకుల ఆలోచనలు, అభిరుచులు మారుతున్నాయి. నాకు తెలిసిన ప్రేక్షకులు లస్ట్‌ స్టోరీస్‌ మొదటి సీజన్ చేసే ఉంటారు. ఓ నటిగా ఇప్పటి వరకు అభిమానులు నన్ను చూడని విధంగా చూపించాలనుకున్నాను. నటిగా నాకు అది చాలా అవసరం.





ఓ హీరోయిన్ గా నన్ను నేను నిరూపించుకోవాలనే ఆకలితో ఉన్నాయి. ఇప్పటి వరకు నా కెరీర్‎లో ఇలాంటి సీన్స్‎లో నటించలేదు. సినిమాలో ఇతర సన్నివేశాలు ఎలాంటివో ఇది అలాగే అని ఆలస్యంగా తెలుసుకున్నాను. నాకు బోల్డ్ సీన్స్‎లో నటించేప్పుడు భయం వేయలేదు. నా ప్రియుడు విజయ్‌ వర్మ నాకు ఎంతో సపోర్టివ్‎గా ఉన్నాడు. జాగ్రత్తగా చూసుకున్నాడు" అని తమన్నా చెప్పుకొచ్చింది.

Updated : 26 Jun 2023 10:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top