Home > సినిమా > ప్రమోషన్ క్యాన్సిల్..నటి అదాకు ఏమైంది? హాస్పిటల్‎కు ఎందుకెళ్లింది?

ప్రమోషన్ క్యాన్సిల్..నటి అదాకు ఏమైంది? హాస్పిటల్‎కు ఎందుకెళ్లింది?

ప్రమోషన్ క్యాన్సిల్..నటి అదాకు ఏమైంది? హాస్పిటల్‎కు ఎందుకెళ్లింది?
X

'ది కేరళ స్టోరీ' సినిమాతో స్టార్డమ్ సంపాదించుకుంది నటి అదా శర్మ. ఆమె లీడ్ రోల్‎లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ మాత్రం మూమూలుగా రాలేదు. అందుకే ఈ బ్యూటీకి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా అదా శర్మకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. అదా శర్మ తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరింది. ఫుడ్ ఎలర్జీతో పాటు డయేరియాతో బ్యూటీ బాధపడుతుందట. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో అదా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటోంది. ఆగస్టు 1న ఆదా శర్మ తన అప్‎కమింగ్ వెబ్ సిరీస్ 'కమాండో' ప్రమోషన్‌ చేయాల్సి ఉంది. కానీ అది క్యాన్సిల్ అయ్యింది. ప్రమోషన్‎కు ముందు ఎమర్జెన్సీగా ఆమెను ఆసుపత్రికి తరలించారు.

అదా శర్మకు తీవ్రమైన డయేరియా, ఫుడ్ అలర్జీతో బాధపడుతున్నట్లు ఆమె కుటుంబీకులు ఒక ప్రకటనలో తెలిపారు. అది ది కేరళ స్టోరీ తరువాత కమాండో అనే వెబ్‌ సిరీస్‌తో అలరించనుంది. ఈ సిరీస్‎లో భావన క్యారెక్టర్ ప్లే చేస్తోంది అదా. ఈ వెబ్ సిరీస్‌లో నటి అదాతో పాటు ప్రేమ్, అమిత్ సియాల్, తిగ్మాన్షు ధులియా, ముఖేష్ ఛబ్రాలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 'ది కేరళ స్టోరీ' బ్లాక్ బస్టర్ తరువాత ఆదాశర్మ చేసే వెబ్ సిరీస్ కావడంతో దీనిపైన మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సిరీస్‌ను విపుల్‌ డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 11న డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Updated : 2 Aug 2023 2:57 PM GMT
Tags:    
Next Story
Share it
Top