Home > సినిమా > Director Krish : డ్రగ్స్ కేసులో నేడు విచారణకు రాలేను.. డైరెక్టర్ క్రిష్ క్లారిటీ

Director Krish : డ్రగ్స్ కేసులో నేడు విచారణకు రాలేను.. డైరెక్టర్ క్రిష్ క్లారిటీ

Director Krish  : డ్రగ్స్ కేసులో నేడు విచారణకు రాలేను.. డైరెక్టర్ క్రిష్ క్లారిటీ
X

గచ్చిబౌలిలోని రాడిసన్ డ్రగ్స్ కేసులో నేడు విచారణకు రాలేనని డైరెక్టర్ క్రిష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం తాను ముంబైలో ఉన్నానని తెలిపారు. 2 రోజుల్లో సమయం కావాలని శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరు అవుతానని క్రిష్ గతమకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా డ్రగ్స్ పార్టీలో ఉన్న నటి లిషి, శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫ్రెండ్స్‌తో డ్రగ్స్‌ పార్టీ చేసుకున్నానంటూ పట్టుబడ్డ వివేకానంద అంగీకరించారు.మందు పార్టీ సమయంలో క్రిష్ వివేకానందతో కలిసి ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ పార్టీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు రాడిసన్ హోటల్‌పై దాడి చేశారు.

బీజేపీ నేత కుమారుడైన వివేకానంద ఈ పార్టీ ఏర్పాటు చేయగా అందులో చాలా మంది ప్రముఖులు పట్టుబడ్డారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. బీజేపీ నేత గజ్జల వివేకనంద ఏర్పాటు చేసిన ఈ డ్రగ్స్ పార్టీకి లిషి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆమెను విచారించనున్నట్టు సమాచారం. 2022 డ్రగ్స్ కేసులో లిషితో పాటు ఆమె సోదరి పేరు కూడా వినిపించింది. యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు. పోలీసులు పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్‌పై దాడి చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.ఇప్పటికే టాలీవుడ్ లో డ్రగ్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. కాగా, పూరీ జగన్నాధ్, ఛార్మీ, ముమైత్ ఖాన్, రవితేజ, రకుల్, తరుణ్ తదితరులు విచారణకు హాజరయ్యారు.




Updated : 28 Feb 2024 8:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top