Home > తెలంగాణ > Ts Govt : పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

Ts Govt : పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

Ts Govt : పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
X

తెలంగాణలో సర్పంచుల పదవీ కాలం దగ్గర పడింది. ఫిబ్రవరి 1తో వారి పదవి కాలం ముగియనుంది. సర్పంచుల పదవీకాలం పొడిగించాలని డిమాండ్లు ఉన్నా ప్రభుత్వం మాత్రం ప్రత్యేకాధికారుల పాలన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం కష్టమని మంత్రి సీతక్క గతంలోనే చెప్పారు. దీంతో ఫిబ్రవరి 2 నుంచి గ్రామాలు అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. ఇప్పటికే అధికారుల జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో మొత్తం 12,777 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2019 జనవరి 21, 25, 30న మూడో విడుతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దీంతో ఫిబ్రవరి 1న వారి పదవీకాలం ముగియనుంది. అయితే జూన్ వరకు తమనే కొనసాగించాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సీఎంను కలిసి వినతి పత్రం అందజేశారు. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఈ అంశంపై ఇంతవరకు స్పందించలేదు. దీంతో ప్రత్యేక అధికారుల పాలన అనివార్యంగా మారింది.

ఇప్పటికే ప్రత్యేక అధికారుల జాబితాను కలెక్టర్లు ప్రభుత్వానికి పంపారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, హెడ్ మాస్టర్లు, వ్యవసాయాధికారులు, వెటర్నరీ డాక్టర్లు, టైపిస్టులు, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని నిర్ణయించింది. అయితే తమకంటే పైస్థాయి వాళ్లనే ప్రత్యేక అధికారులుగా నియమించాలని పంచాయతీ కార్యదర్శులు కోరారు. దీంతో గెజిటెడ్ ఆఫీసర్లనే ప్రత్యేక అధికారులుగా నియమించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.


Updated : 30 Jan 2024 4:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top