Home > సినిమా > ఘనంగా వంగవీటి రాధా పెళ్లి వేడుక.. ప్రముఖులు హాజరు

ఘనంగా వంగవీటి రాధా పెళ్లి వేడుక.. ప్రముఖులు హాజరు

ఘనంగా వంగవీటి రాధా పెళ్లి వేడుక.. ప్రముఖులు హాజరు
X

టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ ఓ ఇంటి వారయ్యారు. వంగవీటి రాధా, పుష్పవల్లి వివాహం విజయవాడలో జరిగింది. ఆదివారం రాత్రి పోరంకిలోని మురళీ రిసార్ట్స్ వేదికగా జరిగిన ఈ వివాహానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. నూతన వధూవరులు వంగవీటి రాధా, పుష్పవల్లికి శుభాకాంక్షలు తెలియజేశారు. వంగవీటి రాధాకు పార్టీలకు అతీతంగా మిత్రులు ఉండడంతో ఆయన పెళ్లిలో పలు పార్టీల నేతలు దర్శనమిచ్చారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు కొడాలి నాని, కొలుసు పార్థసారథి, వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్‌, మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, జలీల్‌ఖాన్‌, నాయకులు యార్లగడ్డ వెంకట్రావు, పారిశ్రామికవేత్తలు, పలువురు ప్రముఖులు, అభిమానులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

రాధా, పుష్పవల్లి నిశ్చితార్థం ఆగస్టులో జరిగింది. పుష్పవల్లి స్వస్థలం నర్సాపురం. ఏలూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల కుమార్తె పుష్పవల్లి. ఇక రాజకీయాల విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల్లో వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నుంచి పోటీకి సిద్దం అవుతున్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో జనసేన లో చేరేందుకు రాధా నిర్ణయించుకున్నారనే వాదన ఉంది. ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తు ఖాయం కావటంతో..రాధా నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది. ఇప్పుడు ఓ ఇంటి వాడయిన వంగవీటి రాధా వచ్చే ఎన్నికల్లో పోటీ పైన త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ ప్రముఖులు వివాహ వేదిక వద్ద రాధాతో కాసేపు మాట్లాడి.. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాధా వివాహ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




Updated : 23 Oct 2023 2:25 AM GMT
Tags:    
Next Story
Share it
Top