Home > సినిమా > ఘనంగా వి బి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డ్స్ 2023 - డా. ఎం. మురళీమోహన్ కి సన్మానం

ఘనంగా వి బి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డ్స్ 2023 - డా. ఎం. మురళీమోహన్ కి సన్మానం

ఘనంగా వి బి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డ్స్ 2023 - డా. ఎం. మురళీమోహన్ కి సన్మానం
X

తొమ్మిదేళ్లుగా తెలుగు సినిమా పరిశ్రమ నుంచి అవార్డులు అందిస్తూ పేద కళాకారులు కుటుంబాలకు చేయూతనిస్తూ వస్తోన్న విబి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డుల పదో వార్షికోత్సవం ఘనంగా జరిగింది.ఈ పదో వార్షికోత్సవం సందర్భంగా సినిమా పరిశ్రమలో 50యేళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ నటుడు, నిర్మాత, మాజీ ఎం.పి డాక్టర్ ఎమ్ మురళీ మోహన్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మురళీ మోహన్ గారు 50యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సంతోషంగా ఉంది. మంచి వ్యక్తిత్వం ఉన్న మురళీ మోహన్ గారిని సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఒక సినీ యాక్టర్ గా చూశాను రాజకీయ నాయకుడిగా చూసాను బయట మంచి వ్యక్తిగా కూడా చూడడం జరిగింది. విష్ణు బొప్పన గారు వి బి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డ్స్ ఆపకుండా చేయడం పదో వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. విష్ణు బొప్పన గారికి ఎప్పుడూ నా సపోర్ట్ ఉంటుంది..’ అన్నారు.

మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘50యేళ్ల నా నట జీవితాన్ని పురస్కరించుకుని నాకు ‘నటసింహ చక్రవర్తి’ అనే బిరుదును ఇవ్వడం ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ బిరుదు సత్కారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిగారి చేతుల మీదుగా జరగడం ఆనందం కలిగిస్తోంది. ఈ సందర్భంగా ఈ వి.బి. ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డ్స్ నిర్వాహకులకు అభినందనలు చెబుతున్నాను. వీళ్లు ఈ అవార్డులు కార్యక్రమాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను. న్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి నంది అవార్డులకున్న విశిష్టత మనకు తెలుసు. కానీ తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డుల గురించి పట్టించుకోవడమే మానేశారు. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో మళ్లీ అది మొదలు పెట్టాలని ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న అవార్డులను ఇవ్వాలి అలానే ఇకనుంచి ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా జరిగేలా మీ ప్రభుత్వం చూడాలి అని మంత్రిగారికి జ్ఞప్తి చేసుకుంటున్నాను..’ అన్నారు.

మురళీమోహన్ గారు చేసిన విజ్ఞప్తికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పందిస్తూ : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ మురళీమోహన్ గారు చెప్పిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మా గవర్నమెంట్ కచ్చితంగా పూర్తి చేస్తాము. తెలుగు రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్ళు అందరం ఒకటే. గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వాల్సి ఉన్న అవార్డులు అన్నిటినీ కూడా కచ్చితంగా ఇచ్చే విధంగా మా గవర్నమెంట్ చేస్తుంది అని ఘాటుగా స్పందించారు.

వి బి ఎంటర్టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన గారు మాట్లాడుతూ : ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఇంత ఘనంగా జరగడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఏడాది పేద కళాకారులకు స్కూల్ ఫీజులు లేదా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఈసారి వికలాంగులకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతులు మీదుగా చెక్కుల అందజేయడం జరిగింది.ఈ సంవత్సరం తో పదో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ పదో వార్షికోత్సవ అవార్డ్స్ సందర్భంగా మురళీమోహన్ గారిని సన్మానించుకోవడం ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్ కి బిజీగా ఉన్నా మా మనవిని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇదే ఉత్సాహంతో ఇంకా ముందు ముందు ఎన్నో అవార్డు ఫంక్షన్లు చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో అతిథులుగా సీతారామం దర్శకుడు హను రాఘవపూడి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, బింబిసార దర్శకుడు వశిష్ట, కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి, హీరోయిన్ ఎస్తేర్, గాయని హారిక నారాయణ, గాయకుడు కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.

V.B.Entertainements Venditera Awards 2023,

Facilitation to Dr. M. Murali Mohan,

Cinematography Minister Komatireddy Venkatreddy,

Telugu Cinema Awards,

Nandi Awards in Congress Governament,

Updated : 30 Dec 2023 1:57 PM GMT
Tags:    
Next Story
Share it
Top