Home > క్రైమ్ > కంపెనీ ఎండీ, సీఈవోలను హత్య చేసిన మాజీ ఉద్యోగి

కంపెనీ ఎండీ, సీఈవోలను హత్య చేసిన మాజీ ఉద్యోగి

కంపెనీ ఎండీ, సీఈవోలను హత్య చేసిన మాజీ ఉద్యోగి
X

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలోకి చొర‌బ‌డిన‌ మాజీ ఉద్యోగి కంపెనీ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌, సీఈవోల‌ను దారుణంగా హ‌త్య చేశాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వివరాలు.. బెంగళూరు అమృతహళ్లిలోని పంపా ఎక్స్‌టెన్షన్‌లో రోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినుకుమార్‌, కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఫణీంద్ర సుబ్రమణ్యలపై ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఫెలిక్స్‌తో సహా ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. వారు కొడవలి, కత్తితో సహా పలు ఆయుధాలతో దాడికి దిగారు.


అయితే తీవ్రంగా గాయపడిన ఫణీంద్ర సుబ్రమణ్య, వినుకుమార్‌లను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. వారి మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు ఫెలిక్స్ ఆఫీసులోకి చొరబడి కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. దాడి చేసి పరారైన వ్యక్తులను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ‘‘ఫెలిక్స్ గతంలో ఏరోనిక్స్‌లో పని చేసేవాడు. కానీ తన సొంత కంపెనీని స్థాపించడానికి రిజైన్ చేసి వెళ్లిపోయాడు’’ ఈశాన్య బెంగళూరు డీసీపీ లక్ష్మీప్రసాద్ తెలిపారు.

ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఫణీంద్రతో పాటు ముగ్గురు నిందితులు ఉత్తర బెంగళూరులోని అమృతహళ్లిలోని కార్యాలయంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో ఆఫీసు ఆవరణలో మరో 10 మంది ఉద్యోగులు ఉన్నారు. ఫణీంద్ర తన గదిలో కూర్చొని ఉండగా ముగ్గురు నిందితులు ఒక్కసారిగా పదునైన ఆయుధాలతో దాడి చేశారు. వినుకుమార్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా.. అతనిపై కూడా దాడి చేశారు. అనంతరం నిందితులు బ్యాక్‌డోర్‌లో నుంచి తప్పించుకున్నారు. పరారైన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వారిని విచారిస్తే అసలు నిజాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు.

Updated : 12 July 2023 9:24 AM GMT
Tags:    
Next Story
Share it
Top