Home > క్రైమ్ > కరెంట్​ బిల్​ ఎక్కువ వచ్చిందని.. రీడింగ్‌ తీసే ఉద్యోగి హత్య

కరెంట్​ బిల్​ ఎక్కువ వచ్చిందని.. రీడింగ్‌ తీసే ఉద్యోగి హత్య

కరెంట్​ బిల్​ ఎక్కువ వచ్చిందని.. రీడింగ్‌ తీసే ఉద్యోగి హత్య
X

అజ్ఞానంతో, ఆవేశంతో ఆ ఊరికి చెందిన వ్యక్తుల కారణంగా అన్యాయంగా ఓ ప్రభుత్వం ఉద్యోగి మరణించాడు. ఊళ్లో ఇంటింటికి తిరిగి కరెంట్​ మీటర్ రీడింగ్ తీసే ఉద్యోగిని.. కరెంట్ బిల్​ ఎక్కువ వచ్చిందని కొంత మంది ఆగంతుకులు వెంబడించారు. ఆ గుంపులోని ఓ వ్యక్తి.. ఆ విద్యుత్​ ఉద్యోగిని అతి దారుణంగా కత్తితో పొడి చంపాడు. ఒడిశాలోని గంజామ్‌ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

జిల్లాలోని గ్యాలరీ గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణ్‌ త్రిపాఠీ అనే విద్యుత్‌ ఉద్యోగి.. కరెంట్​ మీటర్ల రీడింగ్‌ కోసం కుపాటి అనే గ్రామానికి వెళ్లాడు. ఈ క్రమంలో కొంత మంది ఆగంతుకులు అతడ్ని వెంబడించారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న త్రిపాఠీ.. అనంతరం ఓ ఇంటికి వెళ్లి మీటర్‌ రీడింగ్‌ తీస్తున్నాడు. అదే సమయంలో ఆగంతకులు కూడా మళ్లీ అక్కడకు వచ్చారు. ఆ గుంపులో నుంచి వచ్చిన ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో త్రిపాఠీపై దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ త్రిపాఠీ.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వెంటనే ఘటనా స్థలం నుంచి నిందితుడు పరారయ్యాడు.

రక్తపు మడుగులో పడి ఉన్న త్రిపాఠీ మృతదేహాన్ని గమనించిన గ్రామస్థులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. "త్రిపాఠీ ఎలాంటి తప్పు చేయలేదు. అతడ్ని అన్యాయంగా హత్య చేశారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలి." అని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్​ చేశారు. ఘటనపై మీటర్ రీడర్ ఉద్యోగుల సంఘం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.



Updated : 8 Aug 2023 4:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top