Home > భక్తి > Medaram : ఇవాళ మేడారం హుండీల తరలింపు.. ఎక్కడికంటే..?

Medaram : ఇవాళ మేడారం హుండీల తరలింపు.. ఎక్కడికంటే..?

Medaram : ఇవాళ మేడారం హుండీల తరలింపు.. ఎక్కడికంటే..?
X

మేడారం మహా జాతర వైభవంగా జరిగింది. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర కొనసాగింది. శనివారం సమ్మక్క, సారలమ్మ వనప్రవేశంతో ఈ మహాజాతర మగిసింది. ఈ జాతరకు కోటిన్నర మంది భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇవాళ మేడారం నుంచి హుండీలను తరలించనున్నారు. హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపానికి ఈ హుండీలను తరలిస్తారు. మేడారంలో మొత్తం 512 హుండీలను ఏర్పాటు చేశారు. ఈ నెల 29 నుంచి హుండీల లెక్కింపు చేపడతారు. పదిరోజుల పాటు ఈ లెక్కింపు కొనసాగనుంది.





మేడారంలో బుధవారం తిరుగువారం పండగ నిర్వహిస్తారు. మేడారం గ్రామస్థులు, ఆదివాసీలు ఇళ్లను శుద్ధి చేసి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. అప్పటివరకు భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారని అధికారులు తెలిపారు. తిరిగి 2026లో ఈ మహాజాతర మళ్లీ జరగనుంది. ఇక మేడారం జాతరకు వచ్చిన భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ సిబ్బందికి ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. అతి తక్కువ సమయంలోనే మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి.. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు.


Updated : 26 Feb 2024 2:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top