Home > హైదరాబాద్ > హైదరాబాద్లో రెండ్రోజులు నీళ్లు బంద్

హైదరాబాద్లో రెండ్రోజులు నీళ్లు బంద్

హైదరాబాద్లో రెండ్రోజులు నీళ్లు బంద్
X

హైదరాబాద్వాసులకు నీటి కష్టాలు ఎదురుకానున్నాయి. రెండ్రోజుల పాటు నగరంలో నీటి సరఫరా బంద్ కానుంది. గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫస్ట్ ఫేజ్ లో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని ముర్మూర్‌ నుంచి బొమ్మకల్‌ వరకు ఉన్న మెయిన్‌ పైపులైనుకు ఏర్పడ్డ లీకేజీలకు మరమ్మతు పనులు చేపట్టారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ నెల19 (బుధవారం) ఉదయం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు రిపేర్ పనులు కొనసాగనున్నాయి. దీంతో నగరంలోని పలు డివిజన్లలో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నీటి సరఫరాలో అంతరాయం కలుగనున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించారు.

పూర్తిగా నీళ్లు బంద్ అయ్యే ప్రాంతాలు

కూకట్‌పల్లి డివిజన్ : ఎల్లమ్మ బండ, అల్వాల్‌ రిజర్వాయర్‌ పరిధిలోని ప్రాంతాలు.

కుత్బుల్లాపూర్‌ డివిజన్ : షాపూర్‌ నగర్‌, చింతల్‌, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, గాజుల రామారం, సూరారం, అల్వాల్‌ రిజర్వాయర్‌ పరిధి ప్రాంతాలు.

మల్కాజిగిరి/అల్వాల్‌ డివిజన్ : సైనిక్‌ పురి, డిఫెన్స్‌ కాలనీ, అల్వాల్‌ రిజర్వాయర్‌ పరిధిలోని ప్రాంతాలు.

ఉప్పల్‌ డివిజన్ : కాప్రా మున్సిపాలిటీలోని కొన్ని ప్రాంతాలు. సాయిబాబా నగర్‌, రాధిక, మహేష్‌ నగర్‌, అవుట్‌ రిజర్వాయర్‌ పరిధి ప్రాంతాలు.

నాగారం/దమ్మాయిగూడ డివిజన్ : నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి, కీసర, ఆర్జీకే

బొల్లారం డివిజన్ : రింగ్‌ మెయిన్‌ - 3

కొంపల్లి డివిజన్ : కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూంకుంట, జవహర్‌నగర్‌, దేవరయాంజల్‌, హకీంపేట్‌

వీటితో పాటు ప్రజ్ఞాపూర్‌ (గజ్వేల్‌), ఆలేరు (భువనగిరి) ఘన్‌పూర్‌ (మేడ్చల్‌/ శామీర్‌పేట్‌), కంటోన్మెంట్‌ లోని కొన్ని ప్రాంతాలు, ఎంఈఎస్‌, తుర్కపల్లి బయోటెక్‌ పార్కు తదితర ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోనుంది.

పాక్షికంగా నీళ్లు బంద్ అయ్యే ప్రాంతాలు

ఎస్‌.ఆర్‌.నగర్‌ డివిజన్ : బోరబండ, వెంకటగిరి, బంజారాహిల్స్‌ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలు, ఎర్రగడ్డ, అమీర్‌పేట్‌, ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్‌ గూడ.

కూకట్‌పల్లి డివిజన్ : కేపీహెచ్‌బీ, మలేషియన్‌ టౌన్‌ షిప్‌ రిజర్వాయర్‌ పరిధియలబవ ప్రాంతాలు.

శేరిలింగంపల్లి డివిజన్ : లింగంపల్లి నుంచి కొండాపూర్‌, గోపాల్‌నగర్‌, మయూరి నగర్‌ రిజర్వాయర్‌ పరిధిలోని ప్రాంతాలు.

నిజాంపేట్‌ డివిజన్ : ప్రగతినగర్‌లో కొన్ని ప్రాంతాలు, నిజాంపేట్‌,బాచుపల్లి.

నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని జలమండలి అధికారులు సూచించారు.



Updated : 15 July 2023 7:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top