Home > అంతర్జాతీయం > అమెరికాలో భారత విద్యార్థినిపై పిడుగుపాటు.. కోమాలోకి..

అమెరికాలో భారత విద్యార్థినిపై పిడుగుపాటు.. కోమాలోకి..

అమెరికాలో భారత విద్యార్థినిపై పిడుగుపాటు.. కోమాలోకి..
X

అమెరికాలో చదువుకుంటున్న ఓ భారతీయ విద్యార్థిని పిడుగుపాటుకు గురైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతోంది. సుశ్రూణ్య కోడూరు యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాస్టర్స్ చేస్తోంది. జులై మొదటివారంలో ఆమె తన ఫ్రెండ్స్తో కలిసి స్థానిక పార్కులో నడుచుకుంటూ వెళుతుండగా పిడుగుపడింది. దీంతో ఆమె పక్కనున్న కొలనులో పడిపోయింది.

ఈ క్రమంలో సుశ్రూణ్య గుండె సుమారు 20 నిమిషాల పాటు లయతప్పడంతో మెదడు దెబ్బతిని కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు సుదీర్ఘకాలం వైద్యం అందించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు బాధితురాలి బంధువులు తెలిపారు. విద్యార్థిని వైద్య ఖర్చుల కోసం క్రౌడ్ ఫండింగ్ చేపట్టారు. దాతలు 'గోఫండ్‌మీ' ద్వారా ఆర్థిక సాయం అందించాలని కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.

Updated : 21 July 2023 3:38 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top