Home > అంతర్జాతీయం > మతం మార్చుకుందని భారీ కానుకలు

మతం మార్చుకుందని భారీ కానుకలు

మతం మార్చుకుందని భారీ కానుకలు
X

పాకిస్తానీ ప్రియుడిని పెళ్ళాడిన అంజూని అదృష్టం వరించింది. మతం మార్చుకుందని అక్కడి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆమెకు భారీగా కానుకలు అందించారు. భూమిని, డబ్బును ముట్టజెప్పారు.

రాజస్థాన్ కు చెందిన అంజూ ఈమధ్యనే ప్రియుడి కోసం పాకిస్తాన్ వెళ్ళిపోయింది. ఇక్కడ భారత్ లో అంజూకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫేస్ బుక్ లో పరిచయమైన నస్రుల్లాను పాకిస్తాన్ వెళ్ళి మరీ పెళ్ళి చేసుకుంది. దీని మీద కొన్ని రోజులుగా రాద్ధాంతం జరగుతోంది. ఇక్కడ భర్త, తండ్రి ఆమెను బహిష్కరించారు. మరోవైపు అక్కడ అంజూ నస్రుల్లాను పెళ్ళి చేసుకోని హాయిగా తింటూ, తిరుగుతూ ఎంజాయ్ చేస్తోందంటూ వీడియోలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో వార్త హైలెట్ అవుతోంది.

నస్రుల్లాను పెళ్ళి చేసుకోవడానికి అంజూ మతం మార్చుకుని తన పేరును కూడా పాతిమాగా మార్చుకుంది. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్‌ దిల్‌ జిల్లాలోని ఓ గ్రామంలో వారు వీరిద్దరూ నివసిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే భారతదేశం నుంచి వచ్చి మతం మార్చుకుని మరీ పెళ్ళి చేసుకుందని...అక్కడి వ్యాపారస్తులు అంజూకు భారీగా బహుమతులు ఇస్తున్నారు. పైగా మతం మార్చుకున్నందుకే ఇచ్చామని చెబుతున్నారు కూడా. రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సీఈవో అయిన మోసిన్‌ ఖాన్‌ అబ్బాసి వారి ఇంటికి వెళ్ళి మరీ అంజూకు భూమి పత్రాలతో పాటు ఓ చెక్కును కూడా అందజేశారు. ఎంత మొత్తం ఇచ్చారో చెప్పలేదు కానీ...మా దేశం వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకే ఇవన్నఅ అని మాత్రం చెబుతున్నారు అబ్బాసి. ఇస్లాంలోకి మారిన అంజూకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే కానుకలు ఇచ్చామని తెలిపారు.


Anju received 10 Marla housing land,cheque of 50K, & other Gifts, given by Islamabad Based businessman & CEO of Pak Star Group of Companies Mohsin Khan Abbasi. CEO PSG said that, #Anju has converted to Islam and married Nasrullah,so we are welcoming her. #AnjuNasrullahLoveStory pic.twitter.com/22j5CWM9LC

Updated : 31 July 2023 4:03 AM GMT
Tags:    
Next Story
Share it
Top