Home > అంతర్జాతీయం > Mohamed Muizzu : భారత్ తో పెట్టుకోవద్దు.. అధ్యక్షుడికి మాల్దీవ్స్ ప్రజల వార్నింగ్..

Mohamed Muizzu : భారత్ తో పెట్టుకోవద్దు.. అధ్యక్షుడికి మాల్దీవ్స్ ప్రజల వార్నింగ్..

Mohamed Muizzu  : భారత్ తో పెట్టుకోవద్దు.. అధ్యక్షుడికి మాల్దీవ్స్ ప్రజల వార్నింగ్..
X

భారత్ - మాల్దీవులు మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మోదీపై అక్కడి మంత్రులు చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు భగ్గుమన్నాయి. భారత్తో గొడవ వల్ల మాల్దీవులు భారీ నష్టాన్ని మూటగట్టుకుంటోంది. ఈ ఘటన తర్వాత భారతీయులు మాల్దీవులు ట్రిప్స్ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. మాల్దీవ్స్ సర్కార్ ముగ్గురు మంత్రులపై వేటు వేసినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టూరిజం పడిపోవడంతో అక్కడి వ్యాపారులకు తీవ్ర నష్టాలు వాటిల్లుతున్నాయి.

ఈ క్రమంలో మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుపై అక్కడి వ్యాపారులు సహా ప్రజలు ఫైర్ అవుతున్నారు. భారత్ చేసిన సాయాన్ని మరచిపోవద్దని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల దేశ సంస్కృతి, ఆర్థిక, భౌగోళిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపెడుతోందని ఆందోళణ వ్యక్తం చేశారు. కాగా ఆహారం, మౌలిక సదుపాయాలు వంటి వాటిలో మాల్దీవులు భారత్ పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తినడంతో మాల్దీవ్స్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చైనా పర్యటకు వెళ్లిన మాల్దీవ్స్ అధ్యక్షుడు.. చైనీయులను మాల్సివ్స్కు రావాలని ఆహ్వానించడం గమనార్హం.

ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించారు. ఈ సందర్భంగా సముద్రం ఒడ్డున కూర్చొని కాసేపు సేద తీరారు. అంతేకాకుండా సముద్రంలో స్నార్కెలింగ్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. వీటిపై మాల్దీవుల యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మంత్రి మరియం షియునా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీని ఇజ్రాయెల్ తోలుబొమ్మ అని పేర్కొంటూ ట్వీట్ చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత్ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆమె సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఆ పోస్టులను డిలిట్ చేసింది. పోస్టులు డిలిట్ చేసిన.. ఆ వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది.


Updated : 13 Jan 2024 8:20 AM GMT
Tags:    
Next Story
Share it
Top