Home > జాతీయం > కేరళలో బాంబు పేలుళ్లు.. ఒకరి మృతి, 23 మందికి గాయాలు

కేరళలో బాంబు పేలుళ్లు.. ఒకరి మృతి, 23 మందికి గాయాలు

కేరళలో బాంబు పేలుళ్లు.. ఒకరి మృతి, 23 మందికి గాయాలు
X

కేరళలోని ఎర్నాకుళం క్రిస్టియన్ కన్వెన్షన్‌ సెంటర్ భారీ అగ్ని బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ బ్లాస్టింగ్‌లో ఒకరు అక్కడిక్కడే దుర్మరణం చెందగా.. 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. భయాందోళనకు గురైన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీసి, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.

వరుసగా మూడు సార్లు ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. యెహూవా సాక్షి సమావేశంలో మూడు దఫాలు బాంబు పేలుళ్లు జరిగినట్టుగా సమాచారం.యెహూవా సాక్షి సమావేశం పేరుతో శుక్రవారం నుండి ఆదివారం వరకు సమావేశాలు నిర్వహిస్తారు.ఈ సమావేశాలు జరిగే ప్రాంతంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ఉగ్రదాడిగా కూడ పోలీసులు అనుమానిస్తున్నారు.

పేలుడు సంభవించిన సమయంలో కన్వెన్షన్‌లో దాదాపు 2 వేల మందికి పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాంబ్ బ్లాస్లింగ్‌‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. స్థానిక సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




Updated : 29 Oct 2023 6:01 AM GMT
Tags:    
Next Story
Share it
Top