Home > జాతీయం > IIT విద్యార్థినిపై బీజేపీ కార్యకర్తల లైంగిక వేధింపులు

IIT విద్యార్థినిపై బీజేపీ కార్యకర్తల లైంగిక వేధింపులు

IIT విద్యార్థినిపై బీజేపీ కార్యకర్తల లైంగిక వేధింపులు
X

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఐఐటీ విద్యార్థినిపై దారుణం చోటుచేసుకుంది. ఐఐటీ వారణాసి (బీహెచ్‌యూ) క్యాంపస్‌లో ఐఐటీ విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి లంక పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో శివకాంత్‌ మిశ్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్‌ 1న బాధితురాలు తన ఫ్రెండ్‌తో కలిసి హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లింది. ఆ సమయంలో ముగ్గురు వ్యక్తులు మోటార్‌ సైకిల్‌పై వచ్చి బాధితురాలిని, ఆమె స్నేహితురాలిని అడ్డుకున్నారు. కొంతసేపటి తర్వాత ఆమె స్నేహితురాలిని బెదిరించి అక్కడి నుంచి వెళ్లగొట్టారు.

ఆ తర్వాత మారుమూల ప్రదేశానికి తీసుకెళ్లి వివస్త్రను చేశారని.. వీడియో, ఫోటోలు తీసుకున్నారని బాధితురాలు వాపోయింది. అనంతరం 15 నిమిషాల తర్వాత తన ఫోన్‌ నంబర్‌ తీసుకొని వదిలిపెట్టారని ఆమె ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఘటన జరిగిన రెండో రోజు చెత్‌గంజ్‌లోని సీసీటీవీ కెమెరాలో ఈ ముగ్గురూ కనిపించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సమయంలో వారు అనుమానితుడిగా గుర్తించబడ్డాడు, కానీ నిర్ధారణ లేదు. పోలీసులు విచారించి వారిని అరెస్ట్ చేశారు.నిందితులు భేలుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రిజ్ ఎన్‌క్లేవ్ కాలనీ నివాసి కునాల్ పాండే, బజార్దిహాలోని జీవధిపూర్ నివాసి ఆనంద్, సాక్షం పటేల్ గా గుర్తించారు పోలీసులు. ఈ ముగ్గురూ రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నవారే. గత ఎన్నికల్లో బీజేపీ ఐటీ సెల్‌లో పాలుపంచుకున్నారు.




Updated : 1 Jan 2024 3:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top