Home > జాతీయం > అమెరికా రిచ్చెస్ట్ వుమెన్ జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్

అమెరికా రిచ్చెస్ట్ వుమెన్ జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్

అమెరికా రిచ్చెస్ట్ వుమెన్ జాబితాను విడుదల చేసిన ఫోర్బ్స్
X

అమెరికాలో తమ స్వయం శక్తితో ఎదిగిన సంపన్న మహిళల లిస్టును విడుదల చేసింది ఫోర్బ్స్. ఈ జాబితాలో నలుగురు భారతీయ మహిళలకు చోటు దక్కింది. వ్యక్తిగత ఆస్తుల విలువ, కంపెనీల్లో ఉన్న వాటాల విలువల ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది ఫోర్బ్స్.





పెప్సీకో ఛైర్మన్ ఇంద్రీ నూయీ, ఆరిస్టా నెట్ వర్క్ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్, సింటెల్ ఐటీ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథీ, కాన్ ఫ్లూయెంట్ సహా వ్యవస్థాపకురాలు నేహా నార్ఖడే లు ఫోర్బ్స్ రిచెస్ట్ వుమెన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.





ఇంద్రా నూయీ: 350 మిలియన్ డాలర్ల సంపదతో 77 వ స్థానంలో ఉన్నారు. 24 ఏళ్ళు పెప్సీకోలో పనిచేశారు. 2019లో రిటైర్ అయిన నూయీ...పెప్సికో కంపెనీ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. ప్రస్తుతం అమెజాన్ లో బోర్డు సభ్యరాలిగా ఉంటున్నారు.





జయశ్రీ ఉల్లాల్: 2.4 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులతో ఫోర్బ్స్ లిస్ట్ లో 15 వ స్థానంలో ఉన్నారు. 2008 నుంచి జయశ్రీ అరిస్టా నెట్ వర్క్ ప్రెసిడెంట్ గా, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సంస్థలో ఆమెకు 2.4 శాతం వాటా ఉంది. 2022లో అరిస్టా 4.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది.





నీర్జా సేథీ: సింటెల్ కో ఫౌండర్ గా 990 మిలియన్ డాలర్ల సంపదతో 25వ స్థానంలో నీర్జా ఉన్నారు. 1980లో తన భర్త భరత్ దేశాయ్ తో కలిసి సింటెల్ సంస్థను స్థాపించారు. కంపెనీ నుంచి తన వాటా కింద నీర్జా 510 డాలర్లు పొందారు.

నేహా నార్ఖడే: 520 మిలియన్ డాలర్ల సంపదతో 50 స్థానంలో ఉన్నారు. మొదట లింక్డ్ ఇన్ లో సాఫ్ట వేర్ ఇంజనీర్ గా పనిచేసిన ఈమె తరువాత తన కలీగ్స్ తో కలిసి కాన్ ఫ్లూయెంట్ ను స్థాపించారు. ప్రస్తుతం నేహాకు సంస్థలో ఆరు శాతం వాటా ఉన్నట్టు ఫోర్బ్స్ తెలిపింది.

ఇక ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో ఏబీసీ సప్లై కో ఫౌండర్ డైనీ హెండ్రిక్స్ నిలిచారు. ఈమె ఈ ఘనత సాధించడం వరుసగా ఆరోసారి ఇది. డైనీ ఆస్తుల విలువ 15 బిలియన్ డాలర్లు.


Updated : 11 July 2023 3:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top