Home > జాతీయం > స్మార్ట్‌ఫోన్‎కు బానిసై మతిస్థిమితం కోల్పోయిన 10 ఏళ్ల బాలుడు

స్మార్ట్‌ఫోన్‎కు బానిసై మతిస్థిమితం కోల్పోయిన 10 ఏళ్ల బాలుడు

స్మార్ట్‌ఫోన్‎కు బానిసై మతిస్థిమితం కోల్పోయిన 10 ఏళ్ల బాలుడు
X

ఈ రోజుల్లో స్మార్ట్‎ఫోన్ వాడకం చాలా కామనైపోయింది. పసిపిల్లల నుంచి పండు ముసలివారి వరకు ప్రతి ఒక్కరు వినోదం, కాలక్షేపం కోసం ఫోన్‎లను విపరీతంగా వినియోగిస్తున్నారు. కొంత పరిమితి వరకు ఫోన్ వినియోగిస్తే పర్లేదు కానీ అదే పనిగా ఫోన్లకు గంటల గంటలు అతుక్కుపోవడంతో చాలా మంది ఈ మధ్యకాలంలో అనారోగ్యాన్ని గురవుతున్నారు. ఇక పిల్లల విషయానికి వస్తే స్మార్ట్‎ఫోన్ ఇవ్వకపోతే వారు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఏడ్చి గగ్గోలు పెట్టి మరీ తల్లిదండ్రులను సాధించి వారి నుంచి ఫోన్లను తీసుకుని అదే పనిగా వాటిని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా స్మార్ట్‎ఫోన్లలోని ప్లేస్టోర్ నుంచి వివిధ రకాల గేమ్స్‎ను ఇన్‎స్టాల్ చేసుకుని వాటితోనే గంటలు గంటలు గడిపేస్తున్నారు. అలా స్మార్ట్‎ఫోన్‎కు బానిసైన ఓ పదేళ్ల బాలుడు తాజాగా మతిస్థిమితం కోల్పోయాడు.

రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన ఓ బాలుడు అదే పనిగా స్మార్ట్‎ఫోన్‎ను వాడేవాడు. ఈ బాలుడు ఫోన్‎లో ఎక్కువ సమయం ఫ్రీఫైర్‌ గేమ్ తోనే గడిపేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇలా ఆట ఆడుతూ ఆడుతూ ఓడిపోయాడు. ఒక్కసారిగా ఓటమిపాలవడంతో షాక్‏కు గురైన బలుడు ఓటమిని తట్టుకోలేక మతిస్థిమితాన్ని కోల్పోయాడు. బాలుడి పరిస్థితిని గమనించిన పేరెంట్స్ వెంటనే వైద్యులను సంప్రదించారు. స్మార్ట్‎ఫోన్‎కు బానిస కావడం వల్లనే ఇలా అయ్యిందని చెప్పడంతో తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం బాలుడికి ఓ స్పెషల్ స్కూల్ లో నిపుణుల సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఫిజికల్ గేమ్స్ ఆడిస్తూ అతడిని నార్మల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated : 13 July 2023 3:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top