Home > జాతీయం > గుమిగూడిన జనాలపైకి దూసుకెళ్లిన 'జాగ్వార్​'.. 9మంది మృతి

గుమిగూడిన జనాలపైకి దూసుకెళ్లిన 'జాగ్వార్​'.. 9మంది మృతి

మృతుల్లో కానిస్టేబుల్​, హోంగార్డు

గుమిగూడిన జనాలపైకి దూసుకెళ్లిన జాగ్వార్​.. 9మంది మృతి
X


గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన కారు రోడ్డుపై ఉన్నవారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. కాగా, పలువురు గాయపడ్డారు. పోలీసులు, అంబులెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. సమాచారం ప్రకారం.. బుధవారం అహ్మదాబాద్​లోని అర్ధరాత్రి ఇస్కాన్ బ్రిడ్జి వద్ద మహీంద్రా కారు, డంపర్‌ లు ఢీకొన్నాయి. ఆ ప్రమాదాన్ని చూసేందుకు బ్రిడ్జిపై జనం గుమిగూడారు. ఇంతలో గంటకు 160 కిలో మీటర్లకు పైగా వేగంతో దూసుకొచ్చిన జాగ్వార్ కారు అక్కడ ఉన్నవారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మృతుల్లో పోలీసు కానిస్టేబుల్, హోంగార్డు కూడా ఉన్నారు.

బుధవారం-గురువారం మధ్య రాత్రి సర్ఖేజ్-గాంధీనగర్ హైవేపై ఇస్కాన్ ఫ్లైఓవర్‌పై మహీంద్రా థార్ వెనుక నుండి డంపర్‌ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.ప్రమాదం జరిగిన తర్వాత పెద్ద ఎత్తున జనం అక్కడ గుమిగూడారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు సన్నాహాలు చేస్తుండగా, అతివేగంతో దూసుకొచ్చిన కారు జనాన్ని తొక్కేసింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. డబుల్ ప్రమాదం జరగడంతో, పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. పోలీసులు ఇస్కాన్ వంతెన మొత్తాన్ని మూసివేశారు.గాయపడిన వారిని సోలా సివిల్​ ఆస్పత్రికి తరలించారు. మృతులు బొటాడ్, సురేంద్రనగర్‌కు చెందిన యువకులుగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Updated : 20 July 2023 4:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top