Home > జాతీయం > ఆకలి తట్టుకొలేక..పిల్లిని పీక్కుతిన్న యువకుడు

ఆకలి తట్టుకొలేక..పిల్లిని పీక్కుతిన్న యువకుడు

ఆకలి తట్టుకొలేక..పిల్లిని పీక్కుతిన్న యువకుడు
X

ప్రపంచంలో ఎవరికైనా ఉండే ఒకే ఒక శత్రువు....ఆకలి. కోటి విద్యలు కూటి కొరకే అంటారు పెద్దలు. ఆకలి బాధ తట్టుకొలేక ఎంతోమంది ప్రాణాలు గాలిలొ కలిసిపోయాయి అనడంలో ఏమి సందేహం లేదు. ఆకలి మనిషిని ఏదైనా చేసేలా, ఎంతకైనా తెగించేలా చేస్తుంది. మనిషి ఆకలిని తట్టుకోలేక తనకు ఏది దోరికిన దాన్ని తినేస్తాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా! తాజాగా అలాంటి హృదయ విదారక ఘటన కేరళలో చోటుచేసుకుంది.

కేరళలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. కొన్నిరోజులుగా తిండిలేక అలమటిస్తున్న ఓ యువకుడు..తట్టుకోలేక ఆకలిని తీర్చుకోవడానికి చనిపోయిన పిల్లిని పీక్కుతింటూ కనిపించాడు. మలప్పురం జిల్లా కుట్టిపురం బస్టాండులో గుండెల్ని పిండేసే ఈ విషాద దృశ్యం స్థానికులను కలచివేసింది. వెంటనే స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఆ యువకుడికి ఆహారం అందించిన పోలీసులు అతని వద్ద నుంచి వివరాలు సేకరించారు. పోలీసుల వివరాల ప్రకారం అస్సాంలోని ధుబరీ జిల్లాకు చెందిన ఆ 27 ఏండ్ల యువకుడు అక్కడే ఓ కళాశాలలో చదువుతుండేవాడు. గత డిసెంబరులో ఇంట్లోవారికి చెప్పకుండా ఒక్కడే రైల్లో కేరళకు వచ్చేసాడు. డబ్బులు లేకపోవడంతో ఐదురోజులుగా భోజనం చేయలేదు. దీంతో ఆకలి అలమటించి దాన్ని తట్టుకొలేకపోయాడు. ఈ క్రమంలో తనకి చనిపోయిన ఓ పిల్లి కనిపించడంతో, దాని మాంసాన్ని పచ్చిగానే తింటూ స్థానికులకు కనిపించాడు. పోలీసులు అతడి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి యువకుని సమాచారం అందించారు. అనంతరం ఆ యువకుణ్ని ఆసుపత్రిలో చేర్పించారు.

Updated : 5 Feb 2024 4:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top