Home > జాతీయం > మహిళా ఎమ్మెల్యేపై చేయివేసిన బీజేపీ ఎంపీ..వీడియో వైరల్

మహిళా ఎమ్మెల్యేపై చేయివేసిన బీజేపీ ఎంపీ..వీడియో వైరల్

మహిళా ఎమ్మెల్యేపై చేయివేసిన బీజేపీ ఎంపీ..వీడియో వైరల్
X

బీజేపీ ఎంపీ సతీష్ గౌతమ్ ఓ పబ్లిక్ ఈవెంట్‎లో చేసిన పని తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చుట్టూ జనం ఉన్నారన్న విచక్షణ కూడా లేకుండా ఓ మహిళా ఎమ్మెల్యేతో ఆయన ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీంతో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మహిళా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఓ మహిళా ఎమ్మల్యేపట్ల ఎంపీ వ్యవహరించిన తీరు దారుణమని నెటిజన్స్ ఎంపీని ట్రోల్ చేస్తన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో సెప్టెంబర్ 25న దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ సతీశ్ గౌతం, మహిళా ఎమ్మెల్యే ముక్తా రాజాతో పాటు పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో ఇద్దరూ వేదికపై పక్క పక్కనే కూర్చున్నారు. అయితే ఎంపీ గౌతం వెకిలి నవ్వులు నవ్వుతూ ఆమె భుజాలపై చేతులు వేశాడు. దీంతో మహిళా ఎమ్మెల్యే బాగా ఇబ్బంది పడ్డారు. పబ్లిక్ ఈవెంట్‎లో అందరూ ఉన్నారన్న విచక్షణ కూడా లేకుండా ఎమ్మెల్యే చేతులు తాకుతూ, భుజంపై చేయి వేస్తూ ఎంపీ వెకిలిగా ప్రవర్తించిన తీరు అందరికీ చిరాకు తెప్పించింది. అక్కడే ఉన్న కొంత మంది ఈ విషయాన్ని గమనించి ఈ తతంగాన్నిఅంతా ఫోన్లలో వీడియోలు తీశారు. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నెటిజన్లు ఎంపీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

అలీఘర్ ఎంపీ తనను తాకడంతో బీజేపీ మహిళా ఎమ్మెల్యే ఆ సంఘటన తర్వాత తన సీటును మార్చుకున్నారు. కింద ఉన్న ఫోటోలో ఆ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ వీడియో క్లిప్‌లో సతీష్ గౌతమ్ పక్కనే కూర్చున్నట్లు కనిపించిన మహిళా ఎమ్మెల్యే, ఆ తర్వాత ఆమె సీటు మార్చుకున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ మధ్య బీజేపీ నేత కూర్చున్నారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో నెటిజన్స్ ఎంపీని దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

Updated : 30 Sep 2023 8:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top