Home > జాతీయం > హిందూ అమ్మాయిలతో స్నేహితంగా ఉన్నారని ముస్లిం యువకులపై దాడి

హిందూ అమ్మాయిలతో స్నేహితంగా ఉన్నారని ముస్లిం యువకులపై దాడి

హిందూ అమ్మాయిలతో స్నేహితంగా ఉన్నారని ముస్లిం యువకులపై దాడి
X

తోటి మెడికల్ స్టూడెంట్స్ తో కాస్త చనువుగా ఉన్నందుకు కేరళకు చెందిన ముస్లిం యువకులపై దాడి చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. కర్ణాటకలోని మంగళూరు జిల్లా సోమేశ్వర్ బీచ్‌లో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకున్నది. హిందూ యువతులతో బీచ్ లో తిరుగుతున్నారన్న కారణంతో ఆ యువకులను దారుణంగా కొట్టారు. సమాచారం ప్రకారం, ముగ్గురు ముస్లిం యువకులు.. గురువారం సాయంత్రం తమ స్నేహితురాళ్లతో కాలక్షేపం చేసేందుకు బీచ్ కు వచ్చారు. వీరంతా వైద్య విద్యార్థులే.. ఇంతలో ముగ్గురు గుర్తు తెలియని దుండగులు వచ్చి.. తాము పోలీసులమని చెప్పి బాధితుల వివరాలను అడిగి, వారితో ఘర్షణకు దిగారు. ఇంతలో తోపులాట జరగడంతో ముగ్గురు దుండగులు విద్యార్థులపై దాడి చేసి పారిపోయారు.



సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో పాటు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులందరినీ త్వరలో అరెస్టు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కేసు గురించి సమాచారం ఇస్తూ.. మంగళూరు పోలీసు కమిషనర్ కుల్దీప్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. గురువారం సాయంత్రం 7.20 గంటల సమయంలో స్నేహితుల బృందం (మొత్తం 6) సోమేశ్వర్ బీచ్‌లో ఉన్నట్లు తెలిపారు. కొంతమంది వచ్చి వారి పేరు తదితర వివరాలు అడిగి ముగ్గురు యువకులను కొట్టారు. మా పోలీస్ (112) వాహనం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుల కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశామని కమిషనర్ కుల్దీప్ కుమార్ జైన్ అన్నారు.

Updated : 2 Jun 2023 2:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top