Home > జాతీయం > మరో రైలు ప్ర‌మాదం.. రైల్వే ట్రాక్ దాటుతుండగా ఘోరం

మరో రైలు ప్ర‌మాదం.. రైల్వే ట్రాక్ దాటుతుండగా ఘోరం

మరో రైలు ప్ర‌మాదం.. రైల్వే ట్రాక్ దాటుతుండగా ఘోరం
X

ఘోర రైలు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఈ దారుణం జరిగింది. అసల్‌సోల్ డివిజన్ జంతారా ప్రాంతం వద్ద ఉన్న ఖల్‌జరియా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందారు.

రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను రైలు ఢీకొంది. బెంగళూరు - భాగల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగింది. ఈ రైలు ప్ర‌మాదంలో ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న రైల్వే పోలీసులు, స్థానికులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకురున్నారు. సంఘటనా స్థలంలో స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.

ఈ ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య భారీగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పట్టాలు దాటుతుండగా అప్పుడే దూసుకొచ్చిన బంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు వారిని ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు సాగుతున్నాయి.

Updated : 28 Feb 2024 3:46 PM GMT
Tags:    
Next Story
Share it
Top