Home > జాతీయం > High Court : నేటితో సర్పంచుల పదవీకాలం పూర్తి

High Court : నేటితో సర్పంచుల పదవీకాలం పూర్తి

High Court : నేటితో సర్పంచుల పదవీకాలం పూర్తి
X

గ్రామసర్పంచుల పదవీకాలం నేటితో మగిసింది. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేని కారణంగా..గ్రామపాలన ప్రత్యేకాధికారుల చేతిల్లోకి వెళ్లనుంది. ఇవాల్టి నుంచి రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రత్యేక పాలన ప్రారంభంకానుంది. మండల కేంద్రాలకు చెందిన పంచాయతీలకు జిల్లా స్థాయి అధికారిని, మేజర్‌ గ్రామ పంచాయతీలకు ఎమ్మార్వోలు, ఎక్కువ జనాభా గల ఇతర గ్రామాలకు ఎంపీడీవోలు, తక్కువ జనాభా ఉన్న వాటికి పంచాయతీరాజ్‌, రెవెన్యూ శాఖల్లోని సీనియర్‌ అసిస్టెంట్‌, ఆ పైస్థాయి అధికారులు ప్రత్యేక అధికారులుగా కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా గ్రామాలకు అధికారులను నియమించారు. ఇప్పటివరకు సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్‌ చెక్‌పవర్‌ ఉంది. అయితే ఇకపై ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్‌ చెక్‌పవర్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే పలువురు సర్పంచులు తమ పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.




Updated : 1 Feb 2024 3:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top