Home > జాతీయం > Ayodhya Rama Mandira : అయోధ్య ప్రసాదమంటూ స్వీట్ల విక్రయం.. అమెజాన్‌కు నోటీసులు

Ayodhya Rama Mandira : అయోధ్య ప్రసాదమంటూ స్వీట్ల విక్రయం.. అమెజాన్‌కు నోటీసులు

Ayodhya Rama Mandira : అయోధ్య ప్రసాదమంటూ స్వీట్ల విక్రయం.. అమెజాన్‌కు నోటీసులు
X

అయోధ్య రామమందిర ప్రసాదం పేరుతో అమెజాన్ స్వీట్ల విక్రయాలకు పాల్పడుతున్న మోసపూరిత వ్యాపార విధానాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) చేసిన ప్రాతినిథ్యం ఆధారంగా చర్యలు తీసుకుంది. ఈకామర్స్ దిగ్గజంలో కొందరు వ్యాపారులు శ్రీరాం మందిర్ అయోధ్య స్వీట్లు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్న విషయం తన దృష్టికి రావడంతో వినియోగదారుల హక్కుల పరిరక్షణ సంస్థ సెంట్రల్ కన్జుమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) అమెజాన్‌కు నోటీసులు పంపంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో కొందరు వ్యాపారులు దానిని సొమ్ము చేసుకోవాలని భావించి ‘రఘుపతి ఘీ లడ్డూ’, ‘అయోధ్య రాం మందిర ప్రసాదం’, ‘ఖోయా ఖోబీ లడ్డూ’, ‘రాం మందిర్ అయోధ్య ప్రసాదం- స్వదేశీ ఆవు పేడా (స్వీట్) పేరుతో అమెజాన్‌లో విక్రయిస్తున్నారు.

సీసీపీఏ నుంచి నోటీసులు రావడంతో ఇప్పుడు వీటి సేల్స్‌ను అమెజాన్ నిలిపివేసింది.ఆన్‌లైన్‌లో ఆహార ఉత్పత్తుల విక్రయాన్ని ప్రారంభించడం ద్వారా తప్పుడు ప్రాతినిధ్యాలు ఉత్పత్తి యొక్క వాస్తవమైన లక్షణాలకు సంబంధించి వినియోగదారులను తప్పుదారి పట్టించాయి. ఉత్పత్తి యొక్క ఖచ్చితమైన లక్షణాలను పేర్కొన్నట్లయితే, వారు తీసుకోని కొనుగోలు నిర్ణయాలు తీసుకునేలా ఇటువంటి అభ్యాసం వినియోగదారులను తప్పుగా ప్రభావితం చేస్తుంది. వారం రోజుల్లో నోటీసుకు స్పందించాలని, లేదంటే వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద తీసుకోబో చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. ఈ నోటీసుపై అమెజాన్ స్పందించింది. సీసీపీఏ నుంచి నోటీసులు అందాయని, ఆయా సెల్లర్లపై తమ విధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని అమెజాన్ అధికార ప్రతినిధి చెప్పారు. సెల్లర్ల సేల్స్ ఆప్షన్‌ను తొలగించినట్టు పెర్కొన్నారు




Updated : 20 Jan 2024 5:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top