Home > జాతీయం > బెంగళూరు‎..సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంటి తలుపులు తెరిచి చూస్తే..

బెంగళూరు‎..సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంటి తలుపులు తెరిచి చూస్తే..

బెంగళూరు‎..సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంటి తలుపులు తెరిచి చూస్తే..
X

బెంగళూరు‎లో దారుణం జరిగింది. ఓ ఇంటి పెద్ద కోపం ఇంట్లోని వారి ఊపిరి ఆగేలా చేసింది.. సాఫ్ట్‎వేర్ ఉద్యోగం చేస్తున్న వీరాంజేయ అనే వ్యక్తి భార్య , ఇద్దరు పిల్లలను చంపి, తాను సూసైడ్ చేసుకున్నాడు. కాడుగడి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులు హైదరాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా జులై 31న మరణించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.





హైదరాబాద్‎కు చెందిన 31 ఏళ్ల వీరాంజనేయ బెంగళూరులో సాఫ్ట్‎వేర్ జాబ్ చేస్తున్నాడు. కుటుంబంతో సహా సీగేనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. భార్య హేమవతి, ఏడాదిన్నర, ఎనిమిది నెలల వయసున్న ఇద్దరు పిల్లలతో కలిసి ఇతని జీవితం హాయిగానే సాగుతోంది. అయితే ఏమైందో ఏమో కానీ వీరాంజనేయుడు తన భార్య, పిల్లలను హత్యచేశాడు. ఆ తరువాత అతను ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. చాలా రోజులుగా ఇంటి తలుపులు మూసుకుని ఉండటం, ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అపార్ట్‌మెంట్‌ వాసులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అపార్ట్‎మెంట్‎కు వచ్చి ఇంటి తలుపులు తెరవగానే షాక్ అయ్యారు. వీరాంజనేయ భార్య హేమవతి, ఇద్దరు పిల్లలు బెడ్ పైన విగత జీవులుగా కనిపించారు. వీరాంజనేయ డెడ్ బాడీ ఫ్యాన్‎కు వేలాడుతూ కనిపించింది. అయితే వీరంతా ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందన్న కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




Updated : 4 Aug 2023 9:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top