Home > జాతీయం > ‘ఫిర్‌ ఆయేగా మోదీ’.. పాట విడుదల చేసిన బీజేపీ

‘ఫిర్‌ ఆయేగా మోదీ’.. పాట విడుదల చేసిన బీజేపీ

‘ఫిర్‌ ఆయేగా మోదీ’.. పాట విడుదల చేసిన బీజేపీ
X

మురో నాలుగైదు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని, మోదీ హైట్రిక్ ప్రధాని కావాలని.. అధిష్టానం సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికల కోసం తాజాగా ప్రత్యేక ప్రచార గీతాన్ని విడుదల చేసింది. ఆజంగఢ్ ఎంపీ, భోజ్ పురి సినీ నటుడు దినేష్ లాల్ యాదవ్ నారాహువా.. రూపొందించిన ఈ పాటను అధికారికంగా లాంచ్ చేశారు. ‘ఫిర్‌ ఆయేగా మోదీ (మోదీ తిరిగొస్తాడు)’ పేరుతో రూపొందించిన ఈ పాటలో... ఎన్డీయే సర్కారు తీసుకొచ్చిన పథకాలు, మోదీ నేతృత్వంలో అంతర్జాతీయంగా భారత్‌ సాధించిన ఘనతలను ప్రస్తావించారు.

వందే భారత్‌ రైళ్లు, నూతన పార్లమెంట్‌ భవనం, ఆర్టికల్‌ 370, అయోధ్య రామ మందిరానికి సంబంధించిన విశేషాలను ఈ పాట వీడియోలో చూపించారు. ‘బీజేపీ సాధించిన ఘనతలతో ఢంకా మోగిద్దాం. శ్రీరాముడి దీవెనలతో మోదీ మళ్లీ వస్తారు. ఆయన ఓ వ్యక్తి కాదు.. దేశం గర్విస్తున్న శక్తి’ అని రాసుకొచ్చారు. కాగా ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిని బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా మెజారిటీని సాధించాలని చూస్తుంది.



Updated : 28 Dec 2023 10:45 AM GMT
Tags:    
Next Story
Share it
Top