Home > జాతీయం > ఘోర ప్రమాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 13 మంది..

ఘోర ప్రమాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 13 మంది..

ఘోర ప్రమాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 13 మంది..
X

మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుణ జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగి.. 13మంది సజీవ దహనం అయ్యారు. 14మందికి తీవ్ర గాయాలవ్వగా.. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో వాటికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి 8.30 సమయంలో బస్సు గుణ నుంచి ఆరోన్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు తమ ప్రాణాలకు తెగించి బస్సులోని మిగితావారిని రక్షించారు. ఈ ఘటనపై సీఎం మోహన్ యాదవ్ విచారణకు ఆదేశించారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షలు, క్షతగాత్రులకు 50వేల చొప్పున పరిహారం అందిస్తామన్నారు.

Updated : 28 Dec 2023 2:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top