Home > జాతీయం > Bharat Jodo Nyay Yatra : భారత్ జోడో న్యాయ్ యాత్రపై అస్సాంలో కేసు

Bharat Jodo Nyay Yatra : భారత్ జోడో న్యాయ్ యాత్రపై అస్సాంలో కేసు

Bharat Jodo Nyay Yatra : భారత్ జోడో న్యాయ్ యాత్రపై అస్సాంలో కేసు
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రపై అస్సాంలో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్స్‌ లో మార్పులు చేయడంతో పోలీసులు.. యాత్ర నిర్వాహకుడు కేబీ బైజుపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యాహ్నం జోర్హాట్ పట్టణంలో యాత్ర కొనసాగుతున్న సమయంలో ముందుగా నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలోకి మళ్లించారని రూట్ మ్యాఫ్‌లో చూపించని మార్గాన్ని ఎంచుకున్నారని పోలీసులు తెలిపారు. రూట్‌ను అకస్మాత్తుగా మార్చడంతో అంతరాయాలు కలిగించిందని, యాత్ర నిర్వాహకులు, సహ నిర్వాహకులు ట్రాఫిక్ బారికేడ్‌లను బద్దలు కొట్టేలా అక్కడి సమూహాన్ని ప్రేరేపించారని వారు తెలిపారు. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులపై దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపై కూడా దాడి చేసినట్లు తెలిపారు. కాగా, ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’పై కేసు నమోదు చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. యాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని కాంగ్రెస్‌కు చెందిన అస్సాం ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా మండిపడ్డారు. ట్రాఫిక్ మళ్లింపు దగ్గర పోలీసులెవరూ లేరని చెప్పారు. యాత్ర కోసం తమకు కేటాయించిన మార్గం చాలా ఇరుకుగా ఉందని, జనాలు పెద్ద సంఖ్యలో హాజరవ్వడంతో కొన్ని మీటర్ల పాటు పక్కనున్న దారి గుండా ప్రయాణించాల్సి వచ్చిందని వివరించారు. రాహుల్‌ న్యాయ్‌ యాత్ర విజయవంతమవుతోందన్న భయంతోనే.. సీఎం హిమంత శర్మ తమ యాత్రకు ఆటంకం కలిగించాలనుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు




Updated : 19 Jan 2024 5:58 AM GMT
Tags:    
Next Story
Share it
Top