Home > జాతీయం > రాజస్థాన్లో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల

రాజస్థాన్లో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల

రాజస్థాన్లో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల
X

కాంగ్రెస్ ఎట్టకేలకు రాజస్థాన్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. షెడ్యూల్ విడుదలైన రెండు వారాల తర్వాత పార్టీ తరఫున బరిలో దింపే వారి పేర్లు ప్రకటించింది. ఫస్ట్ లిస్ట్లో 33 మంది పేర్లు ఖరారు చేసింది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఈసారి కూడా సదర్ పురా స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ టోంకు నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి నత్ద్వారా నుంచి, దివ్య మాడెర్నా ఓసియాన్ సీటు నుంచి పోటీ చేయనున్నారు. పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొతసారా లచ్మన్ ఘడ్ స్థానం నుంచి అదృష్టం పరీక్షించుకోనున్నారు.




Updated : 21 Oct 2023 10:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top