Home > జాతీయం > గంగానదిలో బాలుడిని తినేసిన మొసలి..కొట్టి చంపిన స్థానికులు..వీడియో వైరల్

గంగానదిలో బాలుడిని తినేసిన మొసలి..కొట్టి చంపిన స్థానికులు..వీడియో వైరల్

గంగానదిలో బాలుడిని తినేసిన మొసలి..కొట్టి చంపిన స్థానికులు..వీడియో వైరల్
X

గంగానదిలో ఘోరం జరిగింది. కొత్త బండి పూజ కోసం గంగానదిలో నీళ్లకు వెళ్లిన ఓ బాలుడు మొసలికి బలైపోయాడు. ఆ బాలుడిని మొసలి నమిలి మింగేసింది. కుమారుడిని రక్షించేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోపంతో మొసలిని పట్టుకొని కొట్టి చంపారు. బీహార్‌లోని వైశాలి జిల్లా రాఘోపూర్ దియారాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

విద్యార్థి అంకిత్ కుమార్ 5వ తరగతి చదువుతున్నాడు. తన తండ్రి కొత్త బైక్ కొనడంతో పూజ చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఖల్సా ఘాట్‌కు వచ్చాడు. ఈ క్రమంలోనే గంగానదిలోకి నీరు తేవడానికి వెళ్లాడు. అప్పటికే మాటు వేసి ఉన్న మొసలి బాలుడిని ఒక్కసారిగా నీటిలోకి లాగేసింది. బాలుడి అరుపులు విన్న తల్లిదండ్రులు కుమారుడిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే ఏ మాత్రం సమయం ఇవ్వకుండా బాలుడు బతికుండగానే ముక్కలుగా ముక్కలుగా కొరికి తినేసింది మొసలి. ఓ గంట తర్వాత బాలుడి అవశేషాలు ఒడ్డుకు వచ్చాయి.

కళ్లముందే కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు తల్లిడిల్లీపోయారు. బంధువులు, ఇతర గ్రామస్తుల సాయంతో చేపల వలవేసిన మొసలిని పట్టుకున్నారు. దానికి చిత్రహింసలు పెట్టి, కర్రతో కొట్టి దారుణంగా చంపారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated : 14 Jun 2023 11:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top