Home > జాతీయం > మిస్ వరల్డ్గా చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా

మిస్ వరల్డ్గా చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా

మిస్ వరల్డ్గా చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా
X

చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనా పిస్కోవా మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ముంబై వేదికగా జరిగిన ఫైనల్స్ లో క్రిస్టీనా కిరీటాన్ని గెలుచుకుంది. ఈ పోటీల్లో మొత్తం 112 దేశాల అందాల తారలు పాల్గొనగా ఆమె ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. క్రిస్టీనా తరువాత తొలి మూడు స్థానాల్లో యాస్మిన్ అజైటౌన్ (లెబనాన్), ఆచే అబ్రహాంస్ (ట్రినిడాడ్ అండ్ టుబాగో), లీసాగో చోంబో (బొత్స్వానా) ఉన్నారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీల్లో రన్నరప్‌గా లెబనాన్ భామ అజైటౌన్ నిలిచింది. కాగా విజేతగా నిలిచిన క్రిస్టినాకు పోలండ్‌కు చెందిన ప్రస్తుత మిస్‌ వరల్డ్‌ కరోలినా కిరీటం ధరింపజేశారు.

అయితే మిస్ వరల్డ్ పోటీల్లో భారత్‌కు నిరాశే మిగిలింది. ఇండియా తరపున బరిలోకి దిగిన కన్నడ భామ సినీ శెట్టి 8వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరి వరకూ ఆమె గట్టిపోటీనే ఇచ్చినప్పటికీ అజైటౌన్ కు (లెబనాన్) టాప్-4లోకి రావడంతో సినీ శెట్టి వెనుదిరగాల్సి వచ్చింది. అయితే మిస్‌ వరల్డ్‌ పోటీలకు 28 ఏళ్ల తర్వాత భారత్‌ ఆతిథ్యమిచ్చింది.

Updated : 10 March 2024 3:54 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top