Home > జాతీయం > Arvind Kejriwal : ఈడీ దూకుడు.. ఢిల్లీ సీఎంకు నాలుగోసారి నోటీసులు

Arvind Kejriwal : ఈడీ దూకుడు.. ఢిల్లీ సీఎంకు నాలుగోసారి నోటీసులు

Arvind Kejriwal  : ఈడీ దూకుడు.. ఢిల్లీ సీఎంకు నాలుగోసారి నోటీసులు
X

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18న విచారణకు రావాలనిఆదేశించారు. కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది నాలుగోసారి. నవంబర్ 2, డిసెంబర్ 21, జనవరి 3న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని గతంలో ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే మూడుసార్లు ఈడీ విచారణకు సీఎం హాజరుకాలేదు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఇప్పటికే కేజ్రీవాల్ను గతేడాది ఏప్రిల్లో ప్రశ్నించింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన ఈడీ నవంబర్ 2న విచారణకు రావాలని అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. అయితే విచారణకు ఆయన డుమ్మా కొట్టారు. దాంతో డిసెంబర్ 21న తమ ముందు హాజరుకావాలని రెండోసారి నోటీసులు జారీ చేయగా.. అప్పుడూ విచారణకు హాజరుకాలేదు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున ఈడీ విచారణకు రాలేనని చెప్పారు. ఈ క్రమంలో జనవరి 3న హాజరుకావాలని ఈడీ మూడోసారి నోటీసులు పంపగా.. అప్పుడూ కేజ్రీవాల్ విచారణకు వెళ్లలేదు.

ఒకవేళ ఈ సారి కూడా కేజ్రీవాల్ విచారణకు డుమ్మా కొడితే ఈడీ కోర్టును ఆశ్రయించే అవకాశముంది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలని పిటిషన్ వేసే అవకాశముంది. ఒకవేళ కోర్టు ఎన్బీడబ్ల్యూ జారీ చేసినా కేజ్రీవాల్ విచారణకు డుమ్మా కొడితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే అవకాశముంది. మరోవైపు గత నోటీసులు సందర్భంగా ఈడీపై ఆప్ తీవ్రంగా మండిపడింది. నోటీసులు అక్రమమని, కేజ్రీవాల్ను అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే నోటీసులు ఇచ్చారని ఆరోపించింది. దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు సీఎం కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారని చెప్పింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న సమయంలో నోటీసులు పంపడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే సమన్లు పంపారని ఆమ్ ఆద్మీ నేతలు ఆరోపిస్తున్నారు.


Updated : 13 Jan 2024 3:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top