Home > జాతీయం > జ్యుడీషియల్‌ కస్టడీకి మాజీ సీఎం

జ్యుడీషియల్‌ కస్టడీకి మాజీ సీఎం

జ్యుడీషియల్‌ కస్టడీకి మాజీ సీఎం
X

ఝార్జండ్ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆయన్ను ఒకరోజు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపించింది. మనీలాండరింగ్ కేసులో సోరెన్ను ఈడీ బుధవారం అరెస్ట్ చేసింది. ఇవాళ ఆయన్ని రాంచీ పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపర్చింది. ఈ క్రమంలో కోర్టు ఆయనకు ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆయన్ని 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. ఈడీ పిటిషన్పై కోర్టు రేపు విచారించనుంది.

కాగా రూ.600కోట్ల భూకుంభకోణంలో హేమంత్ సోరెన్ పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది. భారత సైన్యం ఆధీనంలో ఉన్న భూమిని సోరెన్ అక్రమంగా విక్రయించి లబ్దిపొందారని ఈడీ అభియోగాలు మోపింది. ఇప్పటికే పలుసార్లు ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే సోరెన్ ఈడీ విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో బుధవారం ఆయన్ను 7గంటల పాటు విచారించిన ఈడీ రాత్రి 9.30 కు అరెస్ట్ చేసింది. అయితే ఈడీ అరెస్ట్ ను సోరెన్ సుప్రీంలో సవాల్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం సుప్రీం ఈ పిటిషన్ను విచారించనుంది.

ఇక జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఆయన గవర్నర్ ను కలిసి ఎమ్మెల్యేల మద్ధతు లేఖను అందజేశారు. ఇకపోతే చంపై సోరెన్ జార్ఖండ్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఆయనది సరైకేలా-ఖర్సవాన్ జిల్లాలోని జిలింగ్‌గోడ గ్రామం. 90వ దశకంలో చంపై సోరెన్ జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయనకు జార్ఖండ్ టైగర్‌గా పేరుంది. జేఎంం వ్యవస్థాపకుడు షిబు సోరెన్కు చంపై సన్నిహితుడు. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎంగా ఎంపికయ్యారు.

Updated : 1 Feb 2024 12:40 PM GMT
Tags:    
Next Story
Share it
Top