Home > జాతీయం > Madhya Pradesh : మధ్యప్రదేశ్ సెక్రటెరియట్లో మంటలు

Madhya Pradesh : మధ్యప్రదేశ్ సెక్రటెరియట్లో మంటలు

Madhya Pradesh : మధ్యప్రదేశ్ సెక్రటెరియట్లో మంటలు
X

మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భోపాల్లోని స్టేట్ సెక్రటెరియట్ వల్లభ్‌ భవన్‌’లోని మూడో అంతస్తు నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భవనం నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడం గమనించిన స్థానికులు వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. 20 ఫైర్ ఇంజన్లతో వెంటనే సహాయక చర్యలు చేపట్టి మంటలను ఆర్పివేస్తున్నారు. కాగా ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు చెప్పారు. అయితే ఆ బిల్డింగ్ లో భద్రపరిచిన కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు కాలిపోయినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు.










Updated : 9 March 2024 7:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top