Home > జాతీయం > Minister Vikramaditya Singh : హిమాచల్ ప్రదేశ్‌ కాంగ్రెస్‌కు బిగ్ షాక్..మంత్రి రాజీనామా

Minister Vikramaditya Singh : హిమాచల్ ప్రదేశ్‌ కాంగ్రెస్‌కు బిగ్ షాక్..మంత్రి రాజీనామా

Minister Vikramaditya Singh  : హిమాచల్ ప్రదేశ్‌ కాంగ్రెస్‌కు బిగ్ షాక్..మంత్రి రాజీనామా
X

హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. మంత్రి పదవికి విక్రమాదిత్య సింగ్ రాజీనామా చేశారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని విక్రమాదిత్య వెల్లడించారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సర్కారు ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని తిరుగుబావుటా ఎగురవేశారు. రాజ్య సభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో హిమాచల్ కాంగ్రెస్ సర్కార్ భవిత్యం డైలమాలో పడింది. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. ఈ పరిణామంతో సీఎం సుఖ్విందర్ సింగ్ సర్కార్ మైనార్టీలో పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్కు బలం లేదని.. సీఎం సుఖ్విందర్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.





రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చాయి. ఇద్దరి అభ్యర్థులకు 34 ఓట్లు రావడంతో అధికారులు టాస్ వేశారు. దీంట్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహజన్ విజయం సాధించగా.. అభిషేక్ మనుసింఘ్వి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ గవర్నర్ను బీజేపీ శాసనసభ పక్ష నేత జయరాం ఠాకూర్ కలిశారు. ప్రభుత్వాన్ని మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశించాల్సింది గవర్నర్ను కోరారు. దీంతో హిమాచల్ రాజకీయాలు మరిన్ని మలుపులు తీసుకోనున్నాయి.హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 40స్థానాల్లో గెలిపొందగా.. బీజేపీ 25, ఇండిపెండెంట్లు 3స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆరుగు ఎమ్మెల్యేలు బీజేపీ అనుకూలంగా ఓటేయడంతో కాంగ్రెస్ సంఖ్యాబలం 34కు పడిపోయింది. ఇండిపెండెంట్లతో కలుపుకుని అటు బీజేపీకి 34మంది సభ్యుల బలం ఉంది. దీంతో అక్కడి రాజకీయాలు రసవత్తంగా సాగుతోన్నాయి.







Updated : 28 Feb 2024 6:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top