Home > జాతీయం > MK Stalin : “ఇండియా" గెలిచి తీరాలి.. లేదంటే దేశాన్ని ఎవరూ రక్షించలేరు

MK Stalin : “ఇండియా" గెలిచి తీరాలి.. లేదంటే దేశాన్ని ఎవరూ రక్షించలేరు

MK Stalin  : “ఇండియా గెలిచి తీరాలి.. లేదంటే దేశాన్ని ఎవరూ రక్షించలేరు
X

భారతదేశం మొత్తం మణిపూర్, హర్యానాల కాకుండా నిరోధించాలంటే ‘ఇండియా కూటమి’ తప్పక గెలవాలని అన్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ అనే పోడ్‌కాస్ట్ సిరీస్‌లో భాగంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ సిరీస్ లో స్టాలిన్ మాట్లాడుతూ.. గత 9 ఏళ్లలో బీజేపీ ఏ హామీని నెరవేర్చలేదని అన్నారు. ప్రజల అకౌంట్లలో రూ.15 లక్షలు జమచేస్తానని చెప్పడం, రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందనే హామీ ఇవ్వడం, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవేవీ జరగలేదని స్టాలిన్ విరుచుకుపడ్డారు.ప్రభుత్వ సంస్థల్ని స్నేహితులకు కట్టబెట్టడం, ఎయిర్ ఇండియాను అమ్మడాన్ని కప్పిపుచ్చుకునేందుకు మోడీ సర్కార్ మతవాదాన్ని ఆశ్రయించిందని ఆరోపించారు. పోర్టులు, విమానాశ్రయాలు తమకు దగ్గరగా ఉన్న కార్పొరేట్లకు మోడీ సర్కార్ కట్టబెట్టిందని విమర్శించారు.

మణిపూర్ లో జాతుల మధ్య ఘర్షణ, హర్యానా నూహ్ లో మతకలహాలను గురించి ప్రస్తావిస్తూ.. ప్రజలు ‘బహుళ సాంస్కృతిక, వైవిధ్యభరితమైన భారతదేశాన్ని రూపొందించాలి’’ అని పిలుపునిచ్చారు. 2002 గుజరాత్ అల్లర్లను కూడా స్టాలిన్ మాట్లాడారు. సామాజిక న్యాయం, సామాజిక సామరస్యం, సమాఖ్య, లౌకిక రాజకీయాలు, సోషలిజం పునరుద్ధరణ కోసం ఇండియా కూటమి ఏర్పడిందని, ఇండియా కూటమి గెలవకపోతే భారతదేశాన్ని ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు. ఫెడరలిజానికి ముప్పు వచ్చినప్పుడల్లా డీఎంకే ముందుంటుందని స్టాలిన్ అన్నారు.




Updated : 4 Sep 2023 8:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top